కాలగర్భం లో ... కోటిలింగాల

>> Thursday, September 14, 2006

2500 సం. క్రితం శాతవాహనుల తొలి రాజధాని, ప్రస్తుతం, గోదావరీ తీరంలొ కరీంనగర్ జిల్లా వెలగటూరు మండలం లో ఉన్న కోటిలింగాల. అది ఇప్పుడు ఓ కుగ్రామము. అది ఒకప్పుడు శతవాహన సామ్రాజ్య రాజధాని.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తలపెట్టిన నీటి ప్రాజెక్టుల పుణ్యమా అని ఆ కుగ్రామము "శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్" కింద ముంపునకు గురౌతుంది.

కరీంనగర్‌కు 65 కి.మీ. దూరంలొ ఉన్న కోటిలింగాల గ్రామంలొ పురావస్తు శాఖ 1979 లొ త్రవ్వకాలు నిర్వహిస్తే మట్టి కోట, బౌద్ధ స్తూపం, శ్రీముఖ శాతవాహనుడు ముద్రించిన నాణేలు లభించినాయి. వీటిని పరిశీలిస్తే ఇక్కడ అశోకుని హయాంనకు పూర్వమే ఇక్కడ బౌధమతం ఉన్నట్లు తెలుస్తోంది.

శాతవాహనుల తొలి రాజధాని నీటి ప్రాజెక్టుల వలన కాలగర్భం లోనూ నీటి గర్భం లోనూ కలసి పోతున్నది....

(ఈ విషయమును తెలియచెసినది శ్రీ పి.ఆర్.మాల్యాల గారు, గ్రేట్ఆంధ్రా.కాం అను వెబ్ సైట్ లో)

0 అభిప్రాయాలు: