సవతి

>> Wednesday, October 18, 2006

దేశానికి భారతమాత ఒక్కరే ఉంటారు, తెలుగుతల్లి అంటే ప్రత్యేక దేశం కోసం ప్రయత్నాలు చేస్తున్న కిందకే వస్తుంది - వి. ప్రకాశ్. (TRS ముఖ్య కార్యదర్శి)

అబ్బో అబ్బో ఏమి తెలివో.. ఇంతటి తెలివి వంతులను నాజీవితం లో ఎపుడూ చూడలేదు.

తెలుగుతల్లి విగ్రహం పెట్టడం అహంకారానికి నిదర్శనం.

అబ్బో ఏమి చెప్పారండి, మరి తెలంగాణా తల్లి, తెలంగాణా భవనం.. ఇవేమిటి?

తెలంగాణాతల్లి అంటె తెలంగాణా భూమి పుత్రులుగా మేము ఆవిధంగా అంటున్నాము...

నీ తెలివి తెల్లారా...తెలుగు భూమి, తమిళ భూమి, తెలంగాణ భూమి అంటు వేరే ఉందవని, భాషను బట్టి ప్రాంతాలు ఏర్పడ్డాయనీ నీ కు ఎప్పుడు తెలుస్తుంది?


తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాల ప్రజల జాతి ఒకటికాదు, ఒకే జాతి అంటే భాషతో పాటు సంస్కృతి, ఆచారవ్యవహారాలు, సాంఘీక జీవనవిధానం ఒకే విధంగా ఉండాలి.

నీ బొం...తెలంగాణాము అంటే తెలుగులో గానము..ఒక అద్భుతమైన పాట. తెలుగు అంటె నెల్లూరు, తిరుపతి, కడప, విజయవాడలలో మాట్లాడేది మాత్రమే కాదు...చెన్నపట్టణపు సరిహద్దుల మొదలు కన్నడిగుల చెవులను తాకుతూ, విజయనగరపు రాజధాని "హంపీ" లోని రాతి కట్టడాల ను తాకుతూ, గోల్కొండ లో గోలచేస్తూ, భద్రద్రి లోని రాములవారి పాదాలు తాకుతూ, ప్రకాశం బారేజీ మీద నిలుచొని క్రిష్ణమ్మ తో పరాచకాలాడుతూ, నన్ను తాకగలవా అని విశాఖపట్టణం లో సముద్రుదితో ఆడుకొంటూ, జగ్గన్నాధుని చేవులకు చెరేదే ఈ గానం. అదే తెలంగాణం.

నువ్వు మాట్లాదేది తెలుగు, రాసేది తెలుగు, తిట్టేదీ తెలుగు, నీ తెలుగు లో ఉండేది కేవలము యాస అని, దీని మూలాధారం తెలుగని తెలుసుకో.

పత్రికలవాళ్ళతో, మీడియా వారితో మాట్లాడుతున్నప్పుడు కొంచెము ఆచితూచి మాట్లాడడము చెయ్యి, నీ రాజకీయ భవిష్యత్తుకు అది చాలా అవసరము.

1 అభిప్రాయాలు:

Anonymous October 26, 2006 3:27 am  

చక్క గా చెప్పారు.

విహారి
http://vihaari.blogspot.com