యశ్ భారతి

>> Tuesday, November 21, 2006




'యశ్ భారతి' ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర యువతకు ఇచ్చే ఒక అవార్డు...ఈ ఏడాది మహమ్మద్ కైఫ్ (క్రికెటర్), అభిషేక్ బచ్చన్‌లకు ప్రదానం చేసారు...

ఈ విషయమై ప్రతిపక్షాలు తమ నిరసన తెలియ చెశాయి...

నిరసనా..?....ఎందుకు?

ఎందుకేమిటి?

అభిషేక్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ వాడు కాదన్న వాదన...వారిది...

ఇంకో ముఖ్యమైన విషయము ఏమిటంటే .....

బచ్చన్ వంశంలో ఈ అవార్డు అందుకున్నావారిలో అభిషేక్ నాలుగోవాడు...
1. హరివంశ్ రాయ్ బచ్చన్ (అభిషేక తాతగారు, అమితాబ్ తండ్రిగారు)
2. అమితాబచ్చన్ (అభిషేక్ తండ్రిగారు)
3. జయా బచ్చన్ (అభిషేక్ తల్లి గారు)
4. అభిషేక్ బచ్చన్

(పాపం శ్వేతా బచన్‌న్ని (అభిషేక్ అక్కగారు) ఎందుకు వదిలేసారో?)

మరియొక ముఖ్య విషయం

అభిషేక్ తల్లి గారు..జయా బచ్చన్...ఉత్తరప్రదేష్ పాలక పక్షమైన సమాజవాదీ పార్టీ తరఫున 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' (యం.పి).

అభిషేక్ తండ్రి, అమితాబచ్చన్ ....ఈ రాజకీయ పార్టీ లో మంచి పలుకుబడి ఉన్నవారు.. సంఝ్వాదీ పర్టీ లోని అతి ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి 'అమర్ సింగ్' కి అత్యంత ఆప్తుడు.. అమితాబ్ అప్పుల ఊబిలోంచి బయటకు రావటంలో ఈయన హస్తం ఉందని ఒక సమాచారము...

ఏమిటొ ... నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరైనా అట్టాంటి పదవుల్లో ఉంటే...నేను కూడా..ఒక 'యశ్ భారతో, పద్మశ్రీనో, పద్మబూషణమైన దక్కించుకొనే వాదిని...ఇవికాకపోతె, కనీసం 'బారత రత్న' ఐనా తెచ్చుకొనేవాడినిగా...



కొసమెరుపు : ఈ అవార్డుతో వచ్చే నగదు బహుమతిని (5 లక్షలు.) ప్రభుత్వం నిర్వహించే సాంఘీక సంక్షేమమ పధకాల్లో ఉపయోగించమని అభిషేక్ కోరారు...

0 అభిప్రాయాలు: