నగ్నంగా నాట్యమాడుతున్న యీ ఆలోచనలే - నూతన సంవత్సరానికి స్వాగత గీతాలు

>> Sunday, December 31, 2006

మొత్తం విశ్వంలోవున్న పదార్థం అంతా వొక చిన్న గోళంగా కుదించి వుండేది సృష్టి ప్రారంభంలో. అది ఎందుకు అల్లావుందో, ఎక్కడనుంచి వొచ్చిందో ఎవ్వరికీ తెలియదు.ఉంది.

ఆదిలో దాన్నెవరో గిర్రున తిప్పారు. అది కోట్ల సంవత్సరాలుగా గిరగిర తిరుగుతోది. తిరగడంలో గోళంలోపల పదార్ధాం, అణువులు వోత్తిడికి ఢీకొని విడి వేరు వేరు గోళాలుగ తిరుగాడాయి. అట్లా ఒక్కొక్క గోళంలో నుంచి కొన్ని పిల్లగోళాలు వుద్భవించి, పరిభ్రమిస్తూ వున్నాయి.

విడిపోయిన వాటికి అన్యోన్య ఆకర్షణ వుంది..నిర్ణీతమైన దూరంలో, మార్గంలోతిరుగాడుతాయి...గోళాలు పెరిగిపోతున్నాయి. కొన్ని విడిపోయి, నుశైపోతున్నాయి. కొన్ని పెద్దవైపోతున్నాయి. విశ్వం పెరిగిపోతూవుంది. విశ్వంలో ప్రతి పదార్థమూ గిరగిర తిరిగిపోతోంది. దాన్ని ఎవరూ ఆపలేరు. మొదట్లో ఏ శక్తి తీపిందో, ఆ శక్తికి కూడా నిలపడం సాధ్యం కాదు...సృష్టి ఆగదు..పరిభ్రమిస్తూ వుంతుంది. విశ్వంయొక్క వైశాల్యం, గాంభీర్యంతో పోలిస్తే మానవుడు అల్పుడు. కాని దాని వైశాల్యం, గాంభీర్యం ఎట్టివొ, ఎంతటివో తెలుసుకోగల మహత్తర శక్తి, అద్భుత చైతన్యం, వొక్క మానవుడికే వున్నాయి.

విశ్వంముందు మానవుడి అల్పత్వం ఋజువు కావాలంటె, అది మానవుని ఊహవల్లే జరగాలి.

కానీ, ఇది తెలుసుకోవడం వేరు, ప్రత్యక్ష పరిశోధనకి పూనుకొని, ఊహని కార్యంలోకి మార్చడం వేరు...

ఆ కదలిపోయే సృష్టిని, తిరిగే విశ్వాన్ని చూస్తూ...వేడుకలు జరుపుకోవడం ఎంతవరకూ సబబు?

నగ్నంగా నాట్యమాడుతున్న యీ ఆలోచనలే - నూతన సంవత్సరానికి స్వాగత గీతాలు

ఆలోచనా సరళి మారకుంటె, ఎన్ని క్రొత్త సంవత్సరాలు వచ్చినా ఒక్కటే.

Read more...

మధ్యలో నాకెందుకు?

>> Friday, December 29, 2006

ప్రపంచంలో అరిష్టాలన్నీ అందరూ విశ్రాంతి లేకుండా, పనిలో నిమగ్నులుకావడం వల్లనే సంభవిస్తాయనుకొనేవాళ్ళలో నేనొకణ్ణి. ప్రతి సంవత్సరం వొక్కరోజేనా, ప్రతివ్యక్తి తనుచేసే పని నిలిపివేసి, తమాయించి, తన్నుతాను సింహావలోకనం చేసుకొని ప్రయోజనం కోరకుండా, ప్రపంచాన్ని తిలకిస్తే సత్ చిత్ ఆనందాలు సమకూరుతాయనుకొంటాను.

ప్రపంచం నామాట వినదు, ఈ ముక్కలు ఎందరెందరో చెప్పారు. ఏ వొకరిద్దరు ధన్యజీవులో తప్ప, యీ భోధ ఎవ్వరూ పాతించరు. గోళాలు తిరిగిపోతున్నాయి, భూమి తిరిగిపోతూంది. కాలం ఇంకా వేగంగా తిరుగుతోంది..ఎవ్వరూ ఆపలేరు, సమాజాలు కదలిపోతున్నాయి..మనిషి నిత్యకర్మ అనే చక్రంలో నలిగి తిరిగిపోతున్నాడు.

ఆ చక్రం (నిన్న చెప్పిన 'ఫ్యాను') తను తయారుచేసుకున్నదే..నాలాంటివారెవరైనా ఆపుదామని చెయ్యి పెడితే, ముక్క వూడిపడుతుంది..

మధ్య నాకెందుకు..?

Read more...

నా లోని నేను

>> Thursday, December 28, 2006

పిల్లలకి కదిలే ఆట వస్తువులంటె యిష్టం

ఈ సూత్రాన్ని గుర్తుంచుకొనే నేటి ఆట వస్తువులు తయారవుతున్నాయనుకొంటా..అందుకనే గిరగిర తిరుగుతున్న ఫాన్‌లో చెయ్యిపెట్టి నిలపాలని ప్రయత్నిస్తారు పిల్లలు..


అలా తిరిగే ఫాన్‌లొ వేళ్ళు పెట్టి నిలపాలని పిన్నలకే కాదు పెద్దలకి కుడా అనిపిస్తుంది...నా కట్లా ఎన్నోసార్లు అనిపించేది...దీనికి కారణం ఏమిటో మానసిల శాస్త్రఙ్ఞులు చెప్పాలి.


తెలియనివాటిని శోధించి తెలుసుకోవాలన్న అభిలాష మానవ సహజం! స్విచ్ లో చెయ్యి పెట్టి, విద్యుత్ ద్వారా షాక్‌తింటె ఎట్లా వుంటుందో! అలాగే ఫాన్‌లో చెయ్యి పెట్టి ఆపితే ఏం జరుగుతుందో!


దెబ్బ తగులుతుంది...ఆ దెబ్బలో బాధ వూహించుకొని మనపట్ల మనకి సానుభూతి కలగడం, ఆ సానుభూతి తో ముడిపడే ఆదరణ, శాంతి-యీ రకం చేష్టలకి ప్రేరణ అని తోస్తుంది..నాలుగంతస్తుల మేడమీద నుండి కిందకి చూసినప్పుడు, ఒక్క క్షణం, ఆ గోడమీదనుండి కిందకి దూకాలనిపిస్తుంది. ఊపిరిబిగపెట్టి అంత పని జరిగినట్లు వూహించి గోడనుంచి ఒకడుగు వెనక్కి వెయ్యడం జరుగుతుంది. మనల్ని మనం మనసికంగా బాధించుకోడం కిందకొస్తుంది ఈ తృష్ణ. కానీ చాలమందిలో, నాలో లాగే, యీ తృష్ణ ఊహలోనే వుండిపోతుందేమో..


నాకు చెయ్యాలనిపించికూడా చెయ్యలేకపోయిన పనినికాస్తా, పిల్లలు సాహసంతో చెసెస్తారు..అందుకనే వారిపట్ల ఆరకం ఆకర్షణ, అన్యోన్యం ఏర్పడిందేమో అని స్పురిస్తుంది.'నువ్వు చెయ్యవు కాదూ! చూడు, నేను చెయ్యి పెట్టి ఆపుచేస్తా' అన్నట్లు, ఆ పనిచేసి, చేసినట్లు నవ్వు ద్వారా ప్రకటిస్తారు.

Read more...

నాకు ప్రత్యేక సింహపురి కావాలి!!

ఏమిటో అందరూ...ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్రా, ప్రత్యేక రాయలసీమ కావాలంటున్నారు...

ప్రత్యేక తెలంగాణా వస్తే... అది ఖమ్మం వరకూ, ప్రత్యేక ఆంధ్రా వస్తే అది గోదావరి జిల్లాలవరకూ, ప్రత్యేక రాయలసీమ వస్తే అది కేవలం తిరుపతి వరకూ మాత్రమే వర్తిస్తాయి...

మరి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల పరిస్థితి ఏమిటి...?

అందుకే....

నాకు..ప్రత్యేక ఉమ్మడి కృష్ణా (కృష్ణా & గుంటూరు) కావాలి...మా నాన్న గారు ఇక్కడే సెటిల్ అయ్యారు..

మళ్ళీ నాకే...ప్రత్యేక సింహపురి కావాలి....నేను ఇక్కడ 7వ తరగతి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వరకూ చదివా...మా పెద్దక్కనీ ఇక్కడే ఇచ్చాము..మాకు ఇల్లు కూడా ఉంది..

మళ్ళీ నాకే...ప్రత్యేక రాయలసీమ కూడా కావాలి...ఎందుకంటే...నా డిగ్రీ ఇక్కడే చెశాను.

అందుకే

జై బోలో... ప్రత్యేక సింహపురికి...
జై బోలో... ఉమ్మడి కృష్ణకి...
జై బోలో... ప్రత్యేక రాయలసీమకి...

గమనిక:

దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు...మీరూ చేరండి...మీ రాష్ట్రం కోరండి..

Read more...

అవును..చేరాను...మోపెడ్ కొంటానా?

>> Tuesday, November 21, 2006

పట్టణంలో ఉద్యోగం చేస్తున్న ఒక తమ్ముడు...'మహాదర్శి చిట్‌ఫండ్' లో చేరాడు..ఈ మధ్య తను చాలా బాధపడిపోతున్నాడు. చేరిననాడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఆవగింజంతైన లేదు..తన అక్క తగు సలహా ఇస్తుందని ఆమెకు ఫోన్ చేసాడు...ఆ సంభాషణే ఇది...

తమ్ముడు: అక్కా బాగున్నావా?

అక్క : ఆ.. బాగున్నాను...అదేంటీ? అలా డల్‌గా మాట్లాడుతున్నావు?

తమ్ముడు: అవునే...ఇంతకీ నేను మోపెడ్ కొంటానా లేదా ...నువ్వన్నా చెప్పవే..

అక్క: అదేంటిరా...నిక్షేపంలా కొంటావు...అదేదో దర్శిలో చెరావుకదా..డబ్బుకూడా కడుతున్నావు...

తమ్ముడు: అదేనే...కానీ ఈమధ్య పేపర్లు, టీవీ లు చూసి పిచెక్కుతుందే...నీకుతెలుసుగా...మా బాస్ కూడా ఈ దర్శిలో చేరి సొంతంగా కారు కూడా కొన్నాడే... మొన్నొకసారి కనపడి కారెక్కమంటే...నాకు చిర్రెత్తు కొచ్చి శపధం కూడా చేసేశాను.

అక్క: ఏమనిరా...?

తమ్ముడు: నేను మహాదర్శి లో చేరతాను...మోపెడ్ కొంటాను అని..

అక్క: మరి ఇంకేమిరా....ఆ చిట్ ఫండ్ లో చేరావు...డబ్బు దాచి పెడుతున్నావు...మరి ఇప్పుడు..ఆ అనుమనము ఎందుకు వచ్చింది?

తమ్ముడు: డౌట్ రాదా మరి...పేపర్లలో ఒకాయనేమో నిబద్ధత అంటాడు, నిజయతీ అంటాడు....నిప్పులాంటిది మా నిజయతీ అంటాడు.. మరోపక్కేమో ఇంకోపెద్దాయన వాజ్యమటాడు..లెక్కలు చెప్పమంటాడు.

అక్క: అవున్రా! మీ బావగారు కూడా రోజూ పేపర్లు తిరగేస్తూ, టీవీ చూస్తూ తెగ కామెంట్లు, గంటలకొద్దీ పీకేస్తున్నారు..మీడియా మొత్తం రెడుగా చీలిపోయిందటగా..?

తమ్ముడు: అవునే.., ఒక పేపర్ తిరగేస్తే..రాముడు సత్యసంధుడిలా కనిపిస్తున్నాడు..ఆయన మాట రామబాణం అని పిస్తోంది..మరొక పేపర్ చూస్తే ఆయన మాటకు భరోసా లేదేమో అనిపిస్తోంది...

అక్క: అవున్రా...అంతా రాజకీయమంటున్నారు...

తమ్ముడు: నమ్మకం మావైపు ఉండి...తేడా పాడాలు లేని ఘన చరిత్ర మాది..అసంబద్ధ, అహేతుక ఆరోపణలు చేయడం మంచిది కాదు..అని సదరు కంపెనీ అధిపతి అంటున్నారే, రాజకీయం చేస్తున్నారు..,దురుద్దేశంతో దొంగ దెబ్బ కొట్టాలని చూస్తున్నారు..అని ఆయన అంటుంటే...నేను అడిగింది మామూలు ప్రశ్నలే..చెబితే పోలా, ఎందుకీ అనుచిత భాషాప్రయోగాలు అని మరొకాయన వాదన...

అక్క: అవునూ., ఇద్దరూ చెరొక బహిరంగ లేఖలు వ్రాసారు కదరా...ఆరెండూ చక్కగా పక్కనపక్కన పెట్టి చదువుకోరా..ఏమన్నా అర్ధం అవుతుంది...

తమ్ముడు: అలా చేసిన నా సమస్య పరిష్కారం కావడం లేదే..!

అక్క: పోనీ, ఒక పని చేస్తే పోలా?...

తమ్ముడు: ఏమిటది.?

అక్క: నువ్వు కూడా ఓక బహిరంగ లేఖ రాసి పడేయ్. పత్రికల వాళ్ళూ, టీవీ చానెళ్ళ వాళ్ళూ బోలెడంత ప్రచారం ఇచ్చేస్తారు.

తమ్ముడు: ఏమని రాయనే..

అక్క: వెధవా ..! BA చదువుకున్నావు...అదికూడా నేనే చెప్పాలా?...పైనాన్స్ 'ఫైట్' లో ఇరుపక్షాలు ఎత్తుకు పైయెత్తులు వేసుకొంటున్నాయి. రాజ్కీయ పావులు చక చకా కదులుతున్నాయి. 'చిదంబర' రహస్యాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. ఈ అర్ధిక సమరంలో ఎవరు ఎప్పుడు ఏ వ్యూహం వేస్తారో అంతుపట్టటంలేదు..చివరకు పద్మవ్యూహమో అభిమన్యునిలా 'మదుపుదారుడు' కాకూడదు.

తమ్ముడు: మదుపుదారుడా?...మధ్యలో వాడెవడే..?

అక్క: మీ బావగారు పేపర్ల భాషంతా నా చెవుల్లోకెక్కిస్తూ వుంటే...అలాంటి పదాలే వస్తాయి.నువ్వేమీ కంగారు పడకు...మదపుదారుడంటె..డిపాజిటర్ అని అర్ధమట..

తమ్ముడు: అర్ధం అయిందిలే... అంటే..డిపాజిటర్గా ఒక బహిరంగ లేఖ వ్రాయాలి అంతేకదా.

అక్క: అవును.., ఎవరి ప్రయోజనాలను వాళ్ళు చూసుకొంటూ, మనల్ని నట్టేట ముంచుతారేమో....

తమ్ముడు: (ఆవేశంగా) అలా కానీయను., రాసేస్తాను. మధ్యలో మనమెందుకు మునిగి పోవాలి?, మనమెందుకు ఆందోళన పడాలి?, B.Pలు పెంచుకోవాలి? నేనూ మోపెడ్ కొనుక్కోవాలంటే...గగ్గోలు చేయాల్సిందే...తెగువ చూపాలసిందే..

అక్క: ఒరేయ్! అంతగా అవేశపడకు...రాస్తావ్..కానీ నీ లేఖను...ఏ పేపర్ వాళ్ళు వేస్తారు?...ఇప్పుడున్న మీదియ అంతా చెరో పక్షాన ఉండి క్షణం తీరిక లేకుండా పేజీలకు పేజీలు నిపేస్తున్నారు..టివీల్లో గంటగంటకూ చెవులు ఊదర కొట్టేస్తున్నారు... నీ గురించి ఎవ్వరు పట్టించుకొంటారురా...?

తమ్ముడు: అవును ఎవరు పట్టించుకొంటారు...?...హల్లో.. హల్లో..అక్క మాట్లాడవే ....

(లైన్ కట్ అయింది)

Read more...

యశ్ భారతి




'యశ్ భారతి' ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర యువతకు ఇచ్చే ఒక అవార్డు...ఈ ఏడాది మహమ్మద్ కైఫ్ (క్రికెటర్), అభిషేక్ బచ్చన్‌లకు ప్రదానం చేసారు...

ఈ విషయమై ప్రతిపక్షాలు తమ నిరసన తెలియ చెశాయి...

నిరసనా..?....ఎందుకు?

ఎందుకేమిటి?

అభిషేక్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ వాడు కాదన్న వాదన...వారిది...

ఇంకో ముఖ్యమైన విషయము ఏమిటంటే .....

బచ్చన్ వంశంలో ఈ అవార్డు అందుకున్నావారిలో అభిషేక్ నాలుగోవాడు...
1. హరివంశ్ రాయ్ బచ్చన్ (అభిషేక తాతగారు, అమితాబ్ తండ్రిగారు)
2. అమితాబచ్చన్ (అభిషేక్ తండ్రిగారు)
3. జయా బచ్చన్ (అభిషేక్ తల్లి గారు)
4. అభిషేక్ బచ్చన్

(పాపం శ్వేతా బచన్‌న్ని (అభిషేక్ అక్కగారు) ఎందుకు వదిలేసారో?)

మరియొక ముఖ్య విషయం

అభిషేక్ తల్లి గారు..జయా బచ్చన్...ఉత్తరప్రదేష్ పాలక పక్షమైన సమాజవాదీ పార్టీ తరఫున 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' (యం.పి).

అభిషేక్ తండ్రి, అమితాబచ్చన్ ....ఈ రాజకీయ పార్టీ లో మంచి పలుకుబడి ఉన్నవారు.. సంఝ్వాదీ పర్టీ లోని అతి ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి 'అమర్ సింగ్' కి అత్యంత ఆప్తుడు.. అమితాబ్ అప్పుల ఊబిలోంచి బయటకు రావటంలో ఈయన హస్తం ఉందని ఒక సమాచారము...

ఏమిటొ ... నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరైనా అట్టాంటి పదవుల్లో ఉంటే...నేను కూడా..ఒక 'యశ్ భారతో, పద్మశ్రీనో, పద్మబూషణమైన దక్కించుకొనే వాదిని...ఇవికాకపోతె, కనీసం 'బారత రత్న' ఐనా తెచ్చుకొనేవాడినిగా...



కొసమెరుపు : ఈ అవార్డుతో వచ్చే నగదు బహుమతిని (5 లక్షలు.) ప్రభుత్వం నిర్వహించే సాంఘీక సంక్షేమమ పధకాల్లో ఉపయోగించమని అభిషేక్ కోరారు...

Read more...

అర్ధం కాని అవార్డుల భాగోతం

>> Sunday, November 12, 2006


ఎట్టకేలకు 2005 సంవత్సరానికిగానూ నంది అవార్డులు ఇచ్చేశారు ....తన్నుకు చావండి...
తన్నుకోవడామేమో కానీ ఈ అవార్డులు ఏ ప్రాతిపదికనిచ్చారో అర్ధం కాక జుట్టు పీక్కొంటున్నాను.. మీకేమైన అర్ధమైతే తెలుపవలసినది...

ఉత్తమ హీరో - మహేష్ బాబు
చిత్రం - ఆతడు

విచిత్రంగా మనుషులని చంపే పాత్రలకే అవార్డులు వస్తాయేమిటో... ఐనా ఈ చిత్రం లో హీరో గారి పాత్ర 'మొహములో ఏ భావనలూ కనపడనిది"...దీనికి మహేష్ బాబు సరీగానే న్యాయం చేసాడు అని అనుకొందాం...ఈ జ్యూరీకి ఈ భావాలు పండించని ఈ పాత్రకి, ఈ మనిషి కి ఎలా అవార్డు ఇవ్వాలనిపించింది...?

ఉత్తమ దర్శకుడు - కృష్ణవంశీ
చిత్రం - చక్రం

ఇది మరో విచిత్రం ... కీ.శే. హృషీకేష్ ముఖర్జీ తీసినటువంటి "బావర్చి" నుండి inspiration పొంది (దీనిని inspiration అంటారా copy అంటారా?) కొంచెం ప్రేమ, కొంచెం చేజింగ్లు పెట్టి తీసిన సినిమా. ఈ జ్యురీ కాపీ సినిమలకు కూడా అవార్డులు ఇస్తే దీనికంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయిగా.

దిక్కు లేని "NTR" అవార్డ్...

మహానటుడు నందమూరి తారక రామారావు అవార్డు ఏ నిముషంలో పెట్టారో..పాపం ఎప్పుడు అవాంతరాలే...దీనిగురించి ఇంకోసారి మాట్లాడుకొందాం.

స్పెషల్ జ్యూరీ అవార్డు - వడ్డే నవీన్
చిత్రం -
ఊపిరి


దీని గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది...మిగతాది మీ ఊహ కే వదిలేస్తున్నాను..

చివరిగా అతి ముఖ్యమైనది - ఎవరికీ అర్ధం కానిది

ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం - పెళ్ళాం పిచ్చోడు

ఈ సినిమా విదుదలైనది 2006 (అవార్డు వచ్చినది 2005 సం.) ఈ సినిమ ఒకటి రెండు హాళ్ళలో మాత్రమే విడుదల అయినది, రెందు మూడు రోజులే ఆడిండి.. మరి ప్రజాదరణ ఎలా పొందింది?


ఓ దేవుడా .. మా మంచి దేవుడా ...
చూడడానికి సినిమానిచ్చావ్
పీక్కోవడానికి జుట్టు ఇచ్చావ్
ఎందుకు ఈ నందీ అవార్డుల జ్యూరీనిచ్చావ్?

Read more...

రోడ్డెక్కిన ఫ్రూడెన్షియల్ భాదితులు

>> Thursday, November 09, 2006



ఫ్రూడెన్షియల్ అనే బ్యాంకు ఉందని మీకు గుర్తుందా? ....ఆ...అదే బోర్డు తిప్పేసిన బ్యాంకు...రాజీవ్ రెడ్డి అనే గొప్ప వ్యక్తికి, ఇంకా చాలా మందికి..డిపాజిటర్ల డిపాజిట్లను అప్పనంగా అప్పిచిన ఒక సంస్థ.

పాపం ఈ డిపాజిటర్లంతా, లిక్విడేటర్ వద్ద ఉన్న 140 కోట్లను చెల్లించాలని కోరుతూ రోడ్డెక్కారు ...కొంతసేపు సామూహిక నిరాహారదీక్ష చేసి..ఒక అల్టిమేట్టం ఇచ్చి వెళ్ళారు.

సరే...డబ్బు బ్యాంకులో దాచి ఆదా చేద్దామనుకున్న పిచ్చి వాళ్ళూ, ఆమాయకుల పరిస్థితి ఇలాఉంటే...మరి అప్పుతీసుకున్న వాళ్ళ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ఋణగ్రస్తులలో ముఖ్యులు అయిన 'అమృతా కాసిల్' (హోటల్, సెక్రేట్రేట్ ముందు ఉంటుంది...దీని పరిస్థితి అగమ్యగోచరం..), రాజీవ్ రెడ్డి (అబ్బో ఈయన గురించి చెప్పడం చాలా కష్టం...ఏ రోడ్డు మీద చూసినా ఈయనే).



ఈ రెడ్డిగారు మొన్న బెంగళూరు లో ఒక వ్యాయమశాల (Gym) ప్రారంభించి ప్రముఖులను ఆహ్వానించారు.. రెండు రోజులకొకసారి విదేశీయానం, అక్కడ ఫొటోలు తీయించుకొని ఇక్కద మా క్లబ్బు లో చేరండి అని హోర్డింగులతో ఒకటే పోరు...


దీని వలన నాకు తెలిసిన విషయం :





ఆప్పు చేయ్యండి. తీర్చవలసిన అవసరం లేదు...




అప్పిచినవాడే రోడ్డున పడాతాడు..మనము కులాసాగా విదేశాలు తిరగ వచ్చు.





ఇప్పటికైన ఖాతాదారులు నిరాహారదీక్షలు మనుకొని డబ్బు రాబట్టుకొనే ప్రయత్నము చేయండి...





నా సూచన: ఒక్కసారి లగే రహో మున్నాబాయి లోని ప్రయత్నము చేద్దామా?
కానీ ఇక్కడ బొకేలు పంపించనవసరము లేదు...ప్రతి ఒక్కరూ వారి వారి బ్లాగులలో రాజీవ్ రెడ్డి లాంటి వారు కోరుకోవాలని ఒకే రోజు రాసి పెట్టండి...దాదాపు అవి ఓక 100 దాక చేరుకుంటాయి.. అప్పుడు ఏదో ఒక పేపర్ వాదికి అవి చూపించితే ఇంకా పబ్లిసిటి వస్తుంది...





ఆలోచించండి...

Read more...

తెలుగు పలుకు

>> Wednesday, November 01, 2006

పల్లవి:

తెలుగువాడా తెలుగు మాట తెలియదని అనకు
తేనెలొలుకు తెలుగు పలుకు తనివితీరా పలుకు
తెలుగు మాట చెరుకు ఊట తెలుగుతనము తేట
తెలుగు పలికి తెలుగు వెలుగు చిలుకు ప్రతీపూట

చరణం:

అందమైన అక్షరాలు యాభైఆరు
అన్నిట్లో అందాలు జాలువారు
మీటితే రాగాలు పొంగిపారు
పలికితే భావాలు వేలవేలు
గోదారి గలగలతో క్రిష్ణమ్మ గమకముతో
శృతికలిపి లయపలికే వీనులవిందు మన తెలుగు

చరణం:

నన్నయ తిక్కన వేమనాదులు రంగరించి కలిపిన పాయసమిదియె
చదువులమ్మ చల్లనైన చేతులతోటిఅభయమొసగి పోసిన అమృతమిదియె
మన జాతికి మూలం, మన గుండెల నాదం
తెలుగుభాష కలకాలం నినదించే వేదం

వ్రాసిన వారు శ్రీ సిరాశ్రీ గారు, గ్రేట్ అంధ్రా నందు.
వారికి మీ అభినందనలు తెలియచేయాలంటే ఇక్కడ మీటండి.

Read more...

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

హమ్మయ్యా!

అందరూ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు..
తెలుగు దేశం (ఆంధ్ర) లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బడులు అన్నిటికీ శెలవ ఇవ్వడముతో ఒకటే సందడిగా ఉండి ఉంటుంది..కదా..

జోతి గారు ఆంగ్లములో శుభాకాంక్షలు చెప్పేటప్పటికి, నవీన్ గారికి భాషాభిమానము, రాష్ట్రాభిమానము పొంగుకొచ్చాయి..

జాబిలిముని గారు, జ్యోతిగారికి కొండంత అండగా నిలచారు...

ఇదేనేమో తాడేపల్లి గారు చెప్పిన అనుభంధం...సమైక్య ఆంధ్ర.బాగుంది..

నేను 2 సం క్రింద 'రచ్చబండ్' లో ఒక ప్రశ్న అడిగాను., నాకు జవాబు రాలేదు...ఇప్పటికీ జావాబు దొరకలేదు (సరీగా వెతకలేదేమో)...మీకు ఎవరికైన తెలిస్తే చెబుతారా?

మన రాష్ట్రానికి జెండా ఉందా? ఉంటే దాని రంగు, రూపము తెలుపండి..

Read more...

కొన్ని మంచి పత్రికలు

>> Tuesday, October 31, 2006

కొన్ని మంచి పత్రికలు

మనందరికీ ఈ వల (అంటే internet) లో కధలు, కవితలు చదవడం అలవాటు. మీ అందరికీ కొన్ని మంచి పత్రికలను పరిచయం చెద్దమనుకొంటున్నాను. వీటి గురించి ఎవరికైన తెలుసుంటె...మంచిదే...తెలియని వారికోసం ఈ పరిచయం..
1.)

రచన
సంపాదకుడు: శాయి
వెల: 35 రూ / 10$
ప్రచురణ: హైదరాబాదు
నాణ్యత : బాగుండదు

ఈ పత్రిక ప్రవాసాంధ్రులలో చాల పేరు పొందినది. ఈ పత్రిక ముఖ్యంగా ప్రవాసాంధ్రుల కొరకు నడుపబడుతున్న పత్రిక అని నా అభిప్రాయము.. దీనిలో సాహిత్యానికే పెద్ద పీట. ప్రవాసాంధ్రుల కధలు, కవితలు, సమీక్షలు, విశ్లేషణలు ఎక్కువ...

ఇది మాసపత్రిక - కానీ మాసం మాసం రావడం అనుమానమే..(దీనికి చాలా కారణాలు ఉన్నాయంటారు)

2.

పత్రిక

గౌరవ సంపాదకుడు: శ్రీ రమణ (వీరి గురించి పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు)
వెల: 5 రూ / 10 రూ (ప్రత్యేక సంచిక)
ప్రచురణ: మౌనిక పబ్లికేషన్స్ - హైదరాబాదు
నాణ్యత : బాగుంది

ఈ పత్రిక కూడా సాహిత్య భరితమైనది. ముఖ్యముగా సంపాదకీయం "xxxx - మానవ సంబంధాలు" అదిరిపోతుంది..దీనిలో నానీలు బాగుంటాయి (అర్ధం అయితె), వ్రాసినవారే మళ్ళా వ్రాస్తారు..కొత్తవారికి అవకాసం ఎక్కువ ఇచ్చినట్లు కనపడదు.

కధలు, కవితలు, కాకరకాయలు ఎక్కువ.

ఇది మాస పత్రికో పక్ష పత్రికో గుర్తు లేదు.

3.

రసమయి
సంపాదకుదు : నండూరి పార్ధసారధి
వెల:35 రూ (30 రూ లకు తగ్గించారని చదివినట్లు గుర్తు)
ప్రచురణ : హైదరాబాదు
నాణ్యత : అదిరిపోతుంది

కధలు కాకరకాయలు లేవు. ఇది మాత్రం ప్రతి ఇంటా ఉండవలసిన పత్రిక, మొన్నటి వరకూ భారత భాగవతాల నుంచి కృష్ణుడి గురించి 'క్రిష్ణ సంచికలు (మొత్తం 25 దాకా) ప్రచురించారు...అదుర్స్, ఇంక భానుమతి గురించి, సంగీతం గురించి, అన్నమయ్య రచించిన ప్రజలకు తెలియని పద్యాల గురించి, ఎందుకులే ఒకటా రెండా ....
తప్పకుండా తెప్పించుకోండే...ఈ మాస పత్రికని

చివరిగా
4.

చినుకు
సంపాదకుడు : నండూరి ****
వెల: 10రూ
ప్రచురణ: విజయవాడ
నాణ్యత : ఫరవాలేదు.

కధలు, మినీ కవితలు, కార్టూన్లు దీనిలో వస్తువులు. అదృష్ట దీపక్, నగ్నముని, ఇంకెందరో ఇందులో కనిపిస్తారు.
కొత్తవారికి అవకాశాలు ఇస్తారు.

పైన చెప్పిన పత్రికలు బయట దొరకవు...చందాదారులు కావటమే మార్గం.
100 కి 100 శాతం ఇవి మంచి పత్రికలు అని మరొక సారి నొక్కి వక్కాణిస్తున్నాను.

Read more...

సవతి

>> Wednesday, October 18, 2006

దేశానికి భారతమాత ఒక్కరే ఉంటారు, తెలుగుతల్లి అంటే ప్రత్యేక దేశం కోసం ప్రయత్నాలు చేస్తున్న కిందకే వస్తుంది - వి. ప్రకాశ్. (TRS ముఖ్య కార్యదర్శి)

అబ్బో అబ్బో ఏమి తెలివో.. ఇంతటి తెలివి వంతులను నాజీవితం లో ఎపుడూ చూడలేదు.

తెలుగుతల్లి విగ్రహం పెట్టడం అహంకారానికి నిదర్శనం.

అబ్బో ఏమి చెప్పారండి, మరి తెలంగాణా తల్లి, తెలంగాణా భవనం.. ఇవేమిటి?

తెలంగాణాతల్లి అంటె తెలంగాణా భూమి పుత్రులుగా మేము ఆవిధంగా అంటున్నాము...

నీ తెలివి తెల్లారా...తెలుగు భూమి, తమిళ భూమి, తెలంగాణ భూమి అంటు వేరే ఉందవని, భాషను బట్టి ప్రాంతాలు ఏర్పడ్డాయనీ నీ కు ఎప్పుడు తెలుస్తుంది?


తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాల ప్రజల జాతి ఒకటికాదు, ఒకే జాతి అంటే భాషతో పాటు సంస్కృతి, ఆచారవ్యవహారాలు, సాంఘీక జీవనవిధానం ఒకే విధంగా ఉండాలి.

నీ బొం...తెలంగాణాము అంటే తెలుగులో గానము..ఒక అద్భుతమైన పాట. తెలుగు అంటె నెల్లూరు, తిరుపతి, కడప, విజయవాడలలో మాట్లాడేది మాత్రమే కాదు...చెన్నపట్టణపు సరిహద్దుల మొదలు కన్నడిగుల చెవులను తాకుతూ, విజయనగరపు రాజధాని "హంపీ" లోని రాతి కట్టడాల ను తాకుతూ, గోల్కొండ లో గోలచేస్తూ, భద్రద్రి లోని రాములవారి పాదాలు తాకుతూ, ప్రకాశం బారేజీ మీద నిలుచొని క్రిష్ణమ్మ తో పరాచకాలాడుతూ, నన్ను తాకగలవా అని విశాఖపట్టణం లో సముద్రుదితో ఆడుకొంటూ, జగ్గన్నాధుని చేవులకు చెరేదే ఈ గానం. అదే తెలంగాణం.

నువ్వు మాట్లాదేది తెలుగు, రాసేది తెలుగు, తిట్టేదీ తెలుగు, నీ తెలుగు లో ఉండేది కేవలము యాస అని, దీని మూలాధారం తెలుగని తెలుసుకో.

పత్రికలవాళ్ళతో, మీడియా వారితో మాట్లాడుతున్నప్పుడు కొంచెము ఆచితూచి మాట్లాడడము చెయ్యి, నీ రాజకీయ భవిష్యత్తుకు అది చాలా అవసరము.

Read more...

విజయోత్సవాలు!

>> Friday, October 13, 2006


కొద్ది కాలం క్రిందట దోమల రాజ్యం లో "మహానాడు" జరిగింది.

కుర్ర దోమలు, ముసలి(పెద్ద)దోమలపై విరుచుకుపడ్డాయి -"ఇంతకాలం TRS కాంగ్రెస్సు తో కలసి ఉన్నట్లుగా, మీరు ఆ మనుష్యులతో కలసి ఉన్నారే, ఎప్పుడైనా ఆ మనుష్యులు మిమ్మల్ను పట్టించుకున్నారా?, ఎప్పుడూ చంద్రశేఖర రావుని చూసినట్లు (పురుగుని చూసినట్లు) చూసేవారుకాదా?, మిమ్మలని వాళ్ళ మీడియ ఎప్పుడైన మొదటి పేజీ లో కవర్ చేసిందా?- అని.

ఓ పెద్ద దోమ నచ్చచెప్పబోయింది..చూడు మనుష్యులన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి., వాళ్ళలో వాళ్ళకే అనేక సమస్యలు.. సాగునీటి కుంభకోణానికి విలువ ఇవ్వాలంటాడు ఒక సబ్ ఎడిటరు..,కాదు తాగునీటి కుభకోణానికి అంటాడు మరొకడు.. పోనీ ఎడిటర్ గారు తెగించి ఎదో ఒకటి పెట్టేద్దామంటె పైన సూపర్ ఎడిటర్ Y.S గారి చివాట్లు తప్పవు. ఏ ఫాంట్ లో వేయాలో, ఎక్కడ వేయాలో ఆయనగారి చేత పాటలు తప్పవు..ఈ సంబరంలో, మన మీద వార్త వ్రాయడమే అబ్బురం., పైగా హెడ్‌లైన్స్ లో కావాలనుకోవడం మరీ విడ్డురం.

ఏం? ప్రాజెక్టుల గురించి, హౌసింగ్ స్కాముల గురించి, కాందీశీకుల భూమి గురించి, తెలుగు బాషా పరపతి గురించి, రింగురోడ్ల గురించి., ఇలా అన్నిటి గురించీ వ్రాస్తున్నారుగా..మన గురించి వ్రాయడానికేమైంది? - అని సణిగిందో యువత.

"అవన్నీ సాధారణ ప్రజలను ఆర్ధికంగా బాధించి, నష్టపెట్టేవి., అందుకని వాటి గురించి పట్టించుకుంటారు."..పెద్దరింకంతో నచ్చ చెప్పబోయిందో ముదుసలి.

"ఓహొ! మనం మాత్రం కోన్‌కిస్కా గాళ్ళమా?, మన వలన హెల్త్ పోతుంది కదా..'హెల్త్ ఈజ్ వెల్త్' కాబట్టి వాళ్ళకి వెల్త్ కూడా పోయినట్లే"...అంది ఇంగ్లీషు మీడియం లో చదువుకోని., బ్రిటీషు లైబ్రరీ లో సభ్యత్వము తీసుకొన్న ఒక BPO దోమ.

ఈ భాగ్యానికే ఇంగ్లీషు కొటేషన్ ఎందుకు..."ఆరోగ్యమే మాహా భాగ్యం" అనొచ్చుగా అందో ప్రభుత్వ గ్రంధాలయములో స్థిర నివాసము ఏర్పరచుకొన్న లావుపాటి దోమ..(తెలుగు పుస్తకాల జోలికి వెళ్ళేవారు లేకపోవడము వలన పుస్తకామీద ఉన్న దుమ్మును కూడా దులపక నిద్రపోతున్నాడు లైబ్రేరియన్, అందువలన బద్దకించి దోమలు కూడా అక్కడనే నివాసము ఏర్పరచుకొని ఎగరడము కూడా మర్చిపోయాయి).

"ఆ మన వలన మనుషులకు పోయె ఆరోగ్యం ఎంతలే.. ఐనా మన రాతను, భారత దేశాన్ని ఎవడూ బాగు చేయలేడు"..అందో విదేశాలకు వెళ్ళోచ్చిన ప్రవాస దోమ.

అయినా ఈ మస్కిటో కాయిల్సు, ఆలౌట్లు వెలిగించి మనమంటే ఖాతరు లేకుండా ఉన్నారు, సన్నాసి ఎదవులు అని అరిచాడు నరేంద్ర ని కుట్టొచిన దోమగాడు.

ఆ రోజులే వేరు, మనకోసం దోమతెరలు కుట్టించేవారు, దాని కోసం రాతాలు, పందిరి మంచాలు తయారు చేయించేవారు..ఇప్పుడేముంది?., చిన్న స్విచ్ వేస్తే చాలు సన్నని పొగ రావటం, దెబ్బకి దోమలు చచ్చినట్లు టీవి లొ యాడ్స్ - అంతా పోయేకాలం అని గొణిగింది, గాంధీ కాలంనాటి దోమ.

"ఠాఠ్! నేనొప్పుకోను" అని అరిచిందో యువ దోమ. " ఇలా ఐతే మన పరువేమి గాను? మనల్ని ఉత్తి అల్పప్రాణులనుకోరూ?"

"అల్పప్రాణివి కాకపోతె పెద్ద..పులివా? లేక బలా సాహెబ్వి అని అనుకుంటున్నావా? మనల్ని చీమా, దోమా అని తీసిపారేస్తారు. ప్రాస కుదిరిందనే కాదు, ఆకారంలో ఇంచుమించు ఒకటే అనికాదు, చీమకాటుకి ఎంత విలువో దోమకాటుకి అంతే విలువ అని తాత్పర్యం!" బోధపరిచంది అధ్యక్ష స్థానములో ఉన్న ముసలిదోమ.

"కామ్రేడ్స్! చీమకాటుకి, దోమకాటుకీ ఉన్న తేడా చాటిచెబుదాం, ఎప్పటికైనా దోమలంటె మనుష్యులు భయపడేట్లు చేద్దాం, పోరాడితే పోయేదేమీలేదు ఈ అల్పప్రాణులనే పేరు తప్ప.." అని ముక్తకంఠం తో అరిచాయి విరసం, సరసం, నీరసం ( ఇవి కమ్యూనిస్టు గుంపులు) సభ్యులైన యువ దోమలు.

దీనితో హెడ్‌లైన్స్‌కెక్కుతారని భ్రమ పడుతున్నారా?., ప్రశ్నిచిందో పండు దోమ.

"బద్‌నాం భీతొ నాం హై" అన్నారు మీలాంటి పెద్దలే! ఈనాటి పేపర్లో హెడ్‌లైన్స్ ఏమిటి? యాక్సిడెంట్లు, అవినీతి చర్యలు - ఇవేగా! రాష్ట్రపతి ప్రసంగమైనా క్రింద వేయడమే! ఇక నోబుల్ ప్రైజ్ న్యూసైతే ఎక్కడో లోపలి పేజీలలో వేస్తున్నారు! మనము హెడ్‌లైన్స్ కెక్కాలంటే ఎదో వెధవ పని చేయాలంతే! నేటి నుండి మా సమరం ప్రారంభం!" అన్నాడు మంచి ఊపు మీద ఉన్న ఒక కుర్రదోమ, అంతే అంతలో మంచి కత్తిని, ఒక రంగు రంగుల తలపాగానీ బహూకరించి 'జై' అన్నాయి మిగిలిన కుర్రదోమలు.

ఇక అప్పటినుండి దోమలసేన ఘటోత్కచుడి సేనలా ద్విగుణం, బహుళం ఇంది. శాంతి చర్చల తరువాత మావోయిస్టుల్లా అనేకమంది కొత్తవాళ్ళను రిక్రూట్ చేసుకొన్నాయి. ముక్కుతో రాకెట్‌లాంచర్లా నేరుగా ఎలా ఎటాక్ చేయాలో నేపాల్ వాళ్ళ సహాయంతో వాళ్ళకు బాగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మునిసిపాలిటి వారికి లంచాలించి మురుగ్గుంటలు యిబ్బడిముబ్బడిగా పెరిగేట్లు చూసారు.

ఇక చూస్కొండి, ఎక్కడ చూసినా దోమలే! బోల్డు బోల్డు జ్వరాలు, మోకాళ్ళ నొప్పులు, హై టెంపరేచర్లు. ఈసారి జరిగిన సమావేశంలో కుర్రదోమలు బోర విరుచుకున్నాయి - "చూశారా, మా ప్రతాపం. అందరూ మమ్మల్ని తలుచుకొనేవారె!" అని.

పెద్ద దోమలు పగలబడి నవ్వాయి - ఏడిసినట్లు ఉంది. కష్టమంతా మనది, పేరు ఇం'కోళ్ళ్'ది. ఆ కీళ్ళనొప్పుల వ్యాధికి చికెన్‌గున్యా అని పేరు పెట్టారు. చికెన్ వల్లనే వస్తోందనుకొని కోళ్ళు తినడం మానేశారు. మన ప్రజ్ఞేం తెలిసింది? మనుష్యులకు కోళ్ళంటే భయం పట్టుకొంది కానీ మనమంటే కాదు అని ఎద్దేవా చేశాయి.

"పోనీ ఎదో విధంగా ప్రతిపక్షాలు అల్లరి చేయడానికి అవకాశం ఇచ్చాంగా" అని సమర్ధించుకోబోయాయి కుర్రదోమలు.

"అదంతా వాళ్ళ కుట్ర! రోగాలు లేవు, ఏమీలేవు, అదంతా 'మిత్' అని కొట్టిపారేశాడు ఆరోగ్యమత్రి" అంది చిరాగ్గా BPO దోమ.

"మిత్ అనే బదులు దానికి దగ్గరగా ఉన్న మిధ్య అనే పదం వాడవచ్చుగా" అంది తెలుగు సంఘాలవాళ్ళను కుట్టిన దోమ కోపంగా.(ముఖ్యంగా అనిల్ చీమలమఱ్ఱి ని)(ఇదే దోమ, గ్రంధాలయం లోని దోమ అని గ్రహించగలరు).

"మాయంటావూ, మిధ్యంటావూ" అంటూ శ్రీశ్రీ గేయం ఆలపిస్తూ ఓకుర్రదోమ సమావేశం అవుతుండగానే సరాసరి ఆరోగ్యమంత్రి ఇంటిమీదకి దాడికెళ్ళింది.

కానీ ఆయన ఓపట్టన చలించే ఘటం కాదు. 'నేను డాక్టర్ని కాను, మాఇంట్లో జ్వరం ఎందుకొచ్చిందో తెలియదు. కానీ దీనికి కారణం అపరిశుభ్ర పరిసరాలనీ, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అనడం, ప్రతిపక్షాల బాధ్యతా రాహిత్యం మాత్రమే!, ఇది ప్రతిపక్షాల కుట్ర." అని వాదించాడు.

దోమల వలన జనాలు ఛస్తున్నారని వీళ్లనడం, కాదని ప్రభుత్వం వారు వాదించడం, దానాదీనా దోమలకు రావలసినంత ఖ్యాతి రాకపోవడం జరిగింది.

కుర్రదోమలు విడిగా సమావేశమయ్యాయి. కొడితే ఏనుగు కుంభస్ధలాన్నే కొట్టాలన్న నిర్ణయం జరిగింది. వేస్తే గీస్తే చంద్రశేఖరరావులా ఢిల్లీలోనే పాగా వేయాలని నిశ్చయించారు. ఇరవై మది సభులతో ఆత్మాహుతి దళం ఏర్పాటయింది. హై సెక్యూరిటీ ఉన్న ప్రధనమంత్రి ఇంటిపైననే దాడికి వెళ్ళాలని నిశ్చయించాయి పాలిట్‌బ్యూరో. భగత్‌సింగ్ ఏకంగా పార్లమెంటులో బాంబులు వేయడం చేతనే అందరి దృష్టినీ కర్షించాడనీ, అల్లూరి సీతారామరాజు మద్రాసు అసెంబ్లీ మీద బాణాలేయకపోవడం వల్లనే సరైన ఫోటో కుడా లేకుండా చరిత్రలో మరుగున పడ్డాడని దృష్టాంతాలు వల్లేవేయడం జరిగింది.

ఆత్మాహుతి దళం కదిలింది. ప్రధాని మనుమలు రోగాన పడ్డారు. డెంగ్యూ వ్యాధి అనేది ఉందని, దానివలన ప్రజలు మరణించే ప్రమాదం ఉందని ఎట్టకేలకు అధికారికంగ ప్రభుత్వం ఒప్పుకుంది. దోమల గురించి అన్ని పత్రికలూ మెయిన్ బ్యానర్ హెడ్‌లైన్స్ ఇచ్చాయ్.

దోమల రాజ్యం లో ప్రస్తుతం విజయోత్సవాలు జరుగుతున్నాయి.

ఈ కధని శ్రీ మొక్కపాటి గారు, గ్రేట్ఆంద్రా.కాం నందు వ్రాస్తే నేను కొంచెము మార్పులు చేసి, నా పద్దతి లో అందిస్తున్నాను..మొక్కపాటి గారికి జాబు వ్రాయాలంటే ఇక్కడ నొక్కండి.

Read more...

రామా కనవేమిరా..! శ్రీ రఘురామ కనవేమిరా?

>> Thursday, October 12, 2006





రామా కనవేమిరా..! శ్రీ రఘురామ కనవేమిరా?

ఇదేమిటీ ఈ పాట వ్రాసాడు అని అనుకొంటున్నారా?....కాదండీ చదవండి..మీకే తెలుస్తుంది.

కడప జిల్లా "ఒంటిమిట్ట" లో శ్రీ కోదండరామస్వామివారు కొలువై ఉన్నారు...ఒంటిమిట్టకు ఉన్న విశేషాలు ఏమిటంటే:

ఈ గుడిని చోళులు, విజయనగర రాజులు కట్టించారు.

ఈ గుడిలో, కేవలము సీత, రామ మరియు లక్ష్మణులు మాత్రమే దర్శనమిస్తారు. హనుమానులు గారు లేరు...

ఈ మూడు విగ్రహాలు కలసి ఒకే రాతి పై చెక్కబడ్డాయి.

32 స్తంభాలతో నిర్మించిన "మధ్యరాగమడపం" అతిసుందరమైనది...

దీనిని చూసి ఒక ఫ్రెంచ్ యాత్రికుడు, Tavernier, "one of the grandest pagodas in the whole India". అని అన్నారని ఒక సమాచారము.

ఇవేకాక,

శ్రీ మధ్భాగవతం వ్యాసకర్త "శ్రీ బెమ్మర పోతనామాత్యులు" ఇక్కడివారే..


మాకు తెలుసు ఈ సోది ఆపు అంటారా?...సరె..అసలుది క్రిందుంది చదవండి.

ఆ మండపము మధ్యలో రాతితో చేసిన పుష్పం, దాని మధ్యలో ఒక రాతి మొగ్గ అమర్చారు..ఆ మొగ్గలో వజ్రాలు పెట్టి ఉంటాయని కొందరి అనుమానము / అపోహ /ఊహ .

పురాతన దేవాలయాల్లో విగ్రహాల క్రింద నవధాన్యాలు, వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలు ఉంచి ప్రతిష్ట చేస్తారని నమ్మకము.

ఆ రాతిమొగ్గ చోరీ అయ్యిందని సమాచారము., ఈ దొంగతనము జరిగిన రాత్రి, వాచ్‌మెన్ను ఇంటికి పంపి దేవాదాయ శాఖాధికారి, పురావస్తు శాఖాధికారి, మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గుడిలో మద్యం సేవించినట్లు వినికిడి.

గుడిలో మద్య సేవనం, ఆపై దొంగతనం....రామరామా...

ఓ రామా ఇకనైనా నిద్రలే...ఎమా మొద్దునిద్ర...

Read more...

Point Of View

>> Monday, October 09, 2006

British Diplomat paid a courtesy visit to Lalloojee.

During a Garden party at the Palace, he thought of entertaining Lalloojee with the following magic of numbers.

He said, "Your excellency,

Look at the value of the alphabet:

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26


Now, look at this Sir, if we calculate together it will be:

H A R D W O R K
8 1 18 4 23 15 18 11 = 98 % Only

K N O W L E D G E
11 14 15 23 12 5 4 7 5 = 96 % Only

L O B B Y I N G
12 15 2 2 25 9 14 7 = 86 % Only

L U C K
12 21 3 11 = 47 % Only

Sir, you should look at the final one, which is most important.

A T T I T U D E
1 20 20 9 20 21 4 5 = 100 %

Sir, do you find it useful?

This magic can work on your people to improve themselves, increase productivity, and make your Kingdom prosperous.

Sir, I can arrange to send our experts to coach your people. We can do it in less than a year"

Lalloojee thought for a while; and said,

"I have better formula. See this......

C O R R U P T I O N
3 15 18 21 16 9 15 14 = 111 %

Do you want me to come and teach your people? I can do it in less than one week."

Read more...

క్షమాభిక్ష

>> Thursday, October 05, 2006

ఇండియన్ పీనల్ కోడ్ (IPC) 302, భారత శిక్షా స్మృతిలో అతి పెద్ద శిక్ష - "ఉరి శిక్ష"

ఉరిశిక్ష ఎవరికి వేస్తారు...కరడు కట్టిన తీవ్రవాదులకు, పాశవికంగా హత్యలు చేసేవారికి.

మరి ఉరిశిక్ష పడిన వ్యక్తులకి మానవతా దృక్పధం తో మన ప్రభుత్వం కొంతకాలంగా క్షమాభిక్షను ప్రసాదించి "యావజ్జీవితం కారాగారం" లోనే ఉండే అవకాశాలను కల్పించింది...ఉదా: నళిని భాగ్యనాధన్, రాజీవ్ గాంధీ ని చంపిన వ్యక్తులో ఒకరు.

అయితే భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైన పార్లమెంటు భవనము పై దాడి కేసులో, మరణ శిక్ష ఖరారైన నిందుతుడు అఫ్జల్ గురు క్షమాభిక్ష కొరకు చాలమంది ప్రముఖులు ప్రయత్నిస్తున్నారిప్పుడు. కరడు కట్టిన తీవ్రవాదిగా ముద్రపడ్డ అఫ్జల్ కు మద్దతుగా శ్రీనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, నిజంగా మనము చేసుకొన్న పాపం, సిగ్గుపడాల్సిన విషయం, తలదించుకోవలసిన సమయం.

మానవ హక్కుల గురించి మాట్లాడే మానవహక్కుల సంఘం (మామూలుగా, వీరి దృష్టి లో మనవులంటే నక్సలైట్లు, తీవ్రవాదులు మాత్రమే..) అఫ్జల్ గురు కి క్షమాభిక్ష ప్రసాదించి, మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మర్చేలా రాష్ట్రపతిని కోరుతూ ఢిల్లీ లో ప్రదర్శనలు మొదలు పెట్టింది...దీనికి మద్దతు గా ప్రముఖ రచయిత్రి అరుందతీ రాయ్ ధర్నా నిర్వహించింది...(అసలు వీళ్ళే ఆ దాడి లో ముఖ్యులు అని నా అభిప్రాయం)


భారతీయుడి ఆత్మగౌరవనికి ప్రతీకైన పార్లమెంటు పై దాడి చేసిన వ్యక్తులకు క్షమాభిక్ష ప్రసాదించమని అడగడం, ప్రసాదించడం ఎంతవరకూ సమంజసం?


ఇది ఎంతమాత్రమూ ఆహ్వానించదగిన పరిణామము కాదు. ఈ కేసులో క్షమాభిక్ష ప్రసాదిస్తే త్వరలోనే రాబోతున్న, గుజరాత్ లోని అక్షరధాం కేసు, ముంబై ప్రేలుడుల కేసు, మొన్న జరిగిన ముంబై రైలు బాంబుల కేసు లలో కూడా ఇదే జరుగుతుంది..దేశమంతటా విద్రోహుల అరాచకాలు హెచ్చుమీరి పోతాయి..

చివరిగా నాది చిన్న అనుమానము:

గద్దర్ను, వరావర రావును పోలీసులు ఎత్తుకెళ్ళినప్పుడూ, మొన్న పుట్టపర్తి గారి విగ్రహం పగలగొట్టినప్పుడు..పెట్టిన పిటీషన్లు అరుంధతీ రాయ్ మీద, మానవ హక్కుల సంఘం మీద ఎందుకు పెట్టారు?

మనకి ఆత్మాభిమానము, ఆత్మగౌరవము లేవా? రాజ్యాగము మీద గౌరవము లేదా?...

పైన చెప్పినవి మీకు లేకపోతే "భారతీయులం" అని చెప్పుకో వద్దు దయచేసి...

ఉంటే, మీరే పిటీషన్ పెట్టండి...అందరి సంతకాలు అడగండి. మీవద్దకు పిటీషన్ వస్తే సంతకం పెట్టండి.

Read more...

పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?

>> Saturday, September 30, 2006

ఈ వ్యాసం ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు...ముఖ్యంగా విహారి గారి ఉత్తరాలు చదివి నా అభిప్రాయం చెబుతున్నాను అంతే.


పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?

ఏవరో ఎందుకు కట్టాలి?., మీరు, నేను చాలమా?

ఈ సాలెగూడులో ఎన్నో అద్దెగృహాలు, సొంతిల్లు, వ్రాత పత్రులు (నేను బ్లాగులను ఇలా పిలుస్తాను..మామూలుగా) ఉన్నాయి, దానికి తోడు ఎన్నో సంఘాలు ( ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే గుంపులు) ఉన్నాయి., ఎవరికి వారు దేశం తగలబడి పోతుందని, తెలుగు మృతభాష అవుతుందని గొతుచించుకు చెబుతారు., సంతోషం...నిజానికి వాళ్ళు అరవడం వరకే పరిమితం.

కొందరు కనీసం తెలుగు అభివృద్ధి కొరకు కొన్ని క్రొత్త ప్రయోగాలు చేసి ఈ గణితేంద్రము (కంప్యూటర్ కు వచ్చిన తిప్పలు) లో కొన్ని మార్పులు చేసినారు...వారికి నా ధన్యవాదములు.

ఇది ఇంతవరకే., మిగిలిన కాలములో వారు వారికి నచ్చిన/వీలైన భాషనే ఉపయోగిస్తారు.. దీనిని కాదనే అధికారం మనకు లేదు.

ఈ మధ్య కాలములో వచ్చిన చలన చిత్రములు (సినిమలు) రంగ్ దె బసంతి, లగే రహో మున్నాభాయి లను దాదాపు అందరూ చూసిఉంటారు, అందరికీ నచ్చి వుంటాయి., ఎందుకంటే అందరం విధ్యావంతులం కదా...కానీ ఇందులో చెప్పిన ఒక్క విషయం మనము మర్చి పోయాము...అదేఅంటే

"మార్పు అనేది ఎక్కడినుంచో రాదు...మనదగ్గర్నుండే మొదలవుతుంది".

వాళ్ళు తెలుగులో వ్రాసారా, ఇంకోకరకంగా వ్రాసారా వద్దు....మీరు మొదలు పెట్టండి. ప్రతీ దానికీ తెలుగులోనే జవాబు వ్రాయండి., (వీలైతే మీ కార్యాలయ విషయాలలో కూడా..మమూలుగా ఐతే ఇది కుదరదు..) నేను ఇప్పుడు ఇదే అనుచరిస్తున్నాను...

ఈ మార్గములో మీతో పాటు నడిచే నాలాంటి బాటసారులు చాలామందే ఉండి ఉంటారులేండి...

Read more...

మంచి నాయకులు కావాలేం?

>> Thursday, September 28, 2006

అది కరీంనగర్ నియోజకవర్గంలో ఒక గ్రామం. రచ్చబండ దగ్గర ఓ విద్యార్ధి నాయకుడు ఉపన్యాసం దంచేస్తున్నాడు -

'ఇప్పుడీ ఉపయెన్నిక యెవరికోసం? ఈ ముసలాయన "ఛాలెంజ్" చేసాడట..ఇంకోఆయన రెచ్చగొట్టాడట. ఇప్పుడున్నాయన "ఇజ్జత్ కా సవాల్ " అనుకొని రాజీనామా చేసాడట., సరే!., ఇవతల రాజీనామా చేసినాయన ఎలక్షన్లొ నిలబడతాడో లేదో చెప్పటం లేదు, ఇవతల "ఛాలెంజ్" చేసిన ముసలాయనా కండిడేట్ కాదు. సైన్యాన్ని ఇబ్బంది పెట్టకుండా ద్వందయుద్ధం చేద్దామన్న పెద్దాయన మాట గాలికి ఎగిరిపోయింది. ఇక ఎవరి గురించి ఎన్నిక పెట్టినట్లు? ఎవడబ్బ సొమ్ము ఖర్చు పెడుతున్నట్లు?

"...తెలంగాణా సెంటిమెంటు మీద రెఫరెండం అంటున్నాడు గదయ్యా?.."...అడ్డు తగిలారు ఎవరో.

'...తెలంగాణా మీద రెఫరెండం పెట్టాలంటే., రాష్ట్రం అంతా పెట్టాలి., అనేక విషయాలు తేల్చుకొని ఒక ప్రతిపాదన ముందు పెట్టి మీ అభిప్రాయం చెప్పండి అని అడగాలి. అంతే గానీ ఈఒక్క నియోజక వర్గం లో ఒట్ల బట్టి 294 అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలు ఏమనుకొంటున్నారో తేలిపోతుందా? ఎన్నిక ఫలితం అనేక అంశాలపైన అధరపడి ఉంటుంది. సిట్టింగ్ ఎం.పి ఏమిచేశాడు?.., రాబోయేవాడు ఏమి చేస్తాడు? ఇల అనేక పాయింట్లు వుంటాయి. అందువలన ఇది రెఫరెండమే కాదు.. అసలు నేనడిగేది - ఇప్పుడి ఎలక్షన్లు ఎందుకని?., అందువలన మంచి నాయకులు దొరికేదాకా మనమందరమూ ఎన్నికలను బహిష్కరించాలి - అని పిలుపునిస్తున్నాను. ఇది మనల్ని అడిగి పెట్టిన ఎన్నిక కాదు..'

విద్యార్ధి నాయకుడి ఉపన్యాసం విని అందరూ చప్పట్లు కొట్టారు. 'అంతే..అంతే ఎన్నికల బహిష్కారమే...' అంటూ అరిచారు. కానీ చెట్టునీడన కూర్చొన్న పెద్దాయనలో మాత్రం చలనం లేదు. చుట్ట కాల్చుకొంటూ కూర్చున్నాడు. విద్యార్ధి నాయకుడు ఆయనకేసి తిరిగి 'ఏం పెద్దాయనా! నువ్వేమీ పలక్కుడా వున్నావు? నువ్వెళ్ళి ఓటేస్తావా ఏంది?' అన్నాడు.

ఆయన చుట్ట పడేసి, ఎమర్రా!, అయితే మీరందరూ ఓట్లేయరన్నమాట...అడిగాడు జనం కేసి తిరిగి.

అంతేగదా పెద్దాయనా..! వాళ్ళు మనల్ని అడిగి పెట్టారా ఈ ఎలక్షను? అన్నాడు శ్రోతల్లో ఒకడు.

ఒరే! నేను పెద్ద చదువుకున్నోణ్ని కాను, కానీ తెలియక అదుగుతాను., జవాబు చెబుతావా? అని మొదలెట్టాడు పెద్దాయన.

ఇంకా కావాలంటే.....గ్రేట్ అంధ్రా. కాం (ఇక్కడ) నొక్కండి.

అనిల్ చీమలమఱ్ఱి

Read more...

ఈ పద్య రచయిత ఎవరు?

>> Friday, September 22, 2006




తొండమునేకదంతము దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగమ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
గొండొక గ్రుజ్జు రూపమును గోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్

చంటి పిల్లలు సైతం నేర్చుకొని పాడడనికి వీలుగ ఉన్న ఈ పద్య రచయిత ఎవరు?

Read more...

సంకలనం

>> Sunday, September 17, 2006

నేటి చదువు

ఓం నమఃశివాయ పోయి
ఓహ్ - ఆహ్ స్వరాలు వచ్చాయ్,
అ, ఆ ల స్థానంలో ఎ బి లొచ్చాయ్
పెద్దబాల శిక్ష అసలే లేదు
పెద్ద బరువుల బాల 'శిక్ష' వచ్చి
చిన్న చిన్న పసికూనల్ని
అతలాకుతలం చేస్తోంది
ఇష్ఠపడి చదవడం మాట అటుంచి
కష్టపడి చదవటం ఎక్కువైంది
ఊ అంటే ఫారిన్ చందాన
నేటి చదువు - కకావికలుగా
రూపంతరం చెంది
శాపాంతరంగా మారింది

- కోలపల్లి ఈశ్వర్, నెల్లూరు



చప్ర (చలపాక ప్రకాష్)

ఉమ్మడి కుటుంబాలు
ఏమైపోయాయబ్బా!
అ'పార్ట్' మెంటు రూపం
దాల్చినట్లున్నాయి కాదూ..

- చలపాక ప్రకాష్, విజయవాడ



పీడకల

మనిషికి మనిషే భారమైన వేళ
నైతిక విలువలు దిగజారిన వేళ
విషపు మార్కెట్ సంస్కృతిలో పడి
ప్రేమానురాగాలు లాభనష్టాల
బేరీజులో ఓటమిపాలైన వేళ
రాజ్యం తన విధులను విస్మరించిన వేళ
గుండెలోని ఆర్ధ్రత కన్నీటి రూపంలో
బయటపడుతున్న వేళ
భవిష్యత్తు గురించిన ఆలోచన
నేడు కనే పీడకల

- ముషం చంద్రకళ., కమలాపూర్, కరీంనగర్ జిల్లా

Read more...

శివార్పణం

>> Saturday, September 16, 2006



అల్లన దొండ మెత్తి శివునౌదలయేటి జలంబు వుచ్చి సం
పుల్లత బాద పీఠకము పొంతన యున్న సహస్రనేత్రుని పై
జల్లి శివార్చనా కమల సంహతి బ్రోక్షణ చేయునట్లు శో
బిల్లు గజాననుండు మదభీప్సిత సిద్ది కరుండు గావుతన్||


గనేశుడు తన తండ్రి శివునకు అభిషేకం చేశాడు. అంతకు మునుపే, దేవతల రాజైన ఇంద్రుడు శివునికి అభిషేకము చేసి శివుని పాదపీఠం వద్ద వంగి ప్రణామం చేసి పూజిస్తూ ఉన్నాడు.
ఇంద్రునికి ఒళ్ళంతా కళ్ళే, అందుకే అతనికి సహస్ర నేత్రుడని పేరు., తొండము ఎత్తి శివుని అభిషేకములో నిమఘ్నుడైన గణపతి, శివని పాదాల వద్ద ఉన్న తెరుచుకొని ఉన్న ఆ వేయి కళ్ళను (ఇంద్రుని) చూసి పూలనుకొని భ్రమించి పూజలో ఉంచిన అన్ని వస్తువులను ప్రోక్షణ చేసినట్లు గానే, కళ్ళపై నీరు చల్లి 'శివార్పణం' చేసాడు.

ఈ అద్భుతమైన కావ్యం క్రీ.శ 1550-1560 కాలమునాటి శ్రీ 'పెద్దపాటి జగ్గన' కవి రచించిన 'ప్రబంధ రత్నాకరము' అను సంకలన గ్రంధం లోనిది.

Read more...

కాలగర్భం లో ... కోటిలింగాల

>> Thursday, September 14, 2006

2500 సం. క్రితం శాతవాహనుల తొలి రాజధాని, ప్రస్తుతం, గోదావరీ తీరంలొ కరీంనగర్ జిల్లా వెలగటూరు మండలం లో ఉన్న కోటిలింగాల. అది ఇప్పుడు ఓ కుగ్రామము. అది ఒకప్పుడు శతవాహన సామ్రాజ్య రాజధాని.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తలపెట్టిన నీటి ప్రాజెక్టుల పుణ్యమా అని ఆ కుగ్రామము "శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్" కింద ముంపునకు గురౌతుంది.

కరీంనగర్‌కు 65 కి.మీ. దూరంలొ ఉన్న కోటిలింగాల గ్రామంలొ పురావస్తు శాఖ 1979 లొ త్రవ్వకాలు నిర్వహిస్తే మట్టి కోట, బౌద్ధ స్తూపం, శ్రీముఖ శాతవాహనుడు ముద్రించిన నాణేలు లభించినాయి. వీటిని పరిశీలిస్తే ఇక్కడ అశోకుని హయాంనకు పూర్వమే ఇక్కడ బౌధమతం ఉన్నట్లు తెలుస్తోంది.

శాతవాహనుల తొలి రాజధాని నీటి ప్రాజెక్టుల వలన కాలగర్భం లోనూ నీటి గర్భం లోనూ కలసి పోతున్నది....

(ఈ విషయమును తెలియచెసినది శ్రీ పి.ఆర్.మాల్యాల గారు, గ్రేట్ఆంధ్రా.కాం అను వెబ్ సైట్ లో)

Read more...

గోవిందా...గోవిందా !!!

>> Monday, September 11, 2006

సోదరులారా!...

కోపం వద్దు....పుట్టపర్తి వారు అదృష్టవంతులు....

ఎలాగంటారా...

ఎఱ్ఱటి ఎండలో, లేక, ఝోరు వర్షం లొ, నీడలేక నిలబడి, మట్టి కోట్టుకు పోకుండా కాపాడారు....సంతోషించండి..

మామూలుగా ఐతే, కాకుల రేట్టలకు ఆలవాలము..మన సరస్వతీ పుత్రుల విగ్రహం....

అవునా కాదా?

భారతీయ చింతన: అంత ప్రేమ, భక్తి, గౌరవం ఉంటే ఇంట్లో పెట్టుకొని పూజించు... వాడు విగ్రహం తీసేసాడని గోలెందుకు...అయినా తెలుగు తల్లి విగ్రహం పగిలినప్పుడు రాని కోపం ఇప్పుడెందుకు?

Read more...

రాజభోగం

>> Wednesday, September 06, 2006

kosarAju

ఖాతాదారులను నట్టేట ముంచిన కృషీ బ్యాంకు అధినేత "కొసరాజు గారికి జరుగుతున్న రాజభోగాలు" చూస్తుంటే....ఇతనే మోసం చెశాడా అనిపిస్తుంది..

అర్ధాంతరంగా బ్యాంకును మూసేసి, విదేశాలకు పారిపోయి, విలాసాలు అనుభవించినదే కాకుండా ప్రస్తుతము..చుట్టూ సెక్యూరిటితో, విందులతో, ఆ పరీక్షలు, ఈ పరీక్షలు అని విహార యాత్రలు చేస్తున్నాడు.

అయినా దొంగలకి, నేరస్తులకి, రౌడీలకు ఈ రాజభోగమేమిటో?

వాడు నేను మోసం చేశాను అంటుంటే, లై డిటెక్టర్ పరీక్షలని, ఇంకో పరీక్షలని ఇంకా మన డబ్బు ఎందుకు దొబ్బెట్టాలి? ఖాతాదారులనుంచి దొబ్బింది సరిపోలేదా?

"వాడిని మధ్యకు వదలండి, నిజాలు రాబడతాము", అనే ఖాతాదారులకన్నా లై డిటెక్టర్లు గొప్పవా, నిజాన్ని వెలికి తీయడంలో?

ఇకనైనా ఈ టెస్టులు అనటం మానేసి, " చెబుతావా? ఛస్తావా!" అనడం మచిదేమో...ఆలోచించండి పోలీసు బాబాయిలు...

"కొస"మెరుపు : బ్యాంకులనుంచి ఋణాలు తీసుకొనే ఒక పెద్దమనిషి, ఆ డబ్బుతో, విదేశీయానం చేస్తూ, ఫొటోలు తీసుకోంటూ, రోడ్డు ఎక్కాడు (అదేనండి ప్రకటనలకై బోర్డులు, హోర్డింగులు ఎక్కాడు). ఇంతకీ అతను డబ్బు మొత్తం చెల్లించాడా లేదా, దేశంలో ఉన్నాడా లేదా అనేవి తెలియలేదు.

అతని పేరా....ఆ ఒక్కటీ అడక్కు..!

(ప్రపంచం మొత్తానికీ అతని పేరు తెలుసు...మీకు తెలియకపోతే చెప్పండి....అప్పుడు నేను చెబుతాను.)

Read more...

నమ్మలేని నిజం

>> Tuesday, August 29, 2006

1)
చిత్తూరు జిల్లాలో తెలుగు మాధ్యమంలో చదివితే " ఉపాధ్యాయ శిక్షణలో ప్రవేశానికి కేవలం 1శాతం అవకాశం ఉంది.

తమిళ మాధ్యమంలో చదివితే 16 నుంచి 17 శాతం, ఉర్దూ మాధ్యమంలో చదివితే 30 శాతం అవకాశాలు ఉన్నాయి.

ఉర్దూను పక్కన పెట్టినా తెలుగు, తమిళ భాషలు రెండూ తెలిసిన సామాన్యుడు తన బిడ్డలను ఏ మాధ్యమంలో చదివిస్తాడో ఆలోచించండి!


2)
తమిళ సాహిత్యం లో మాదిగల గురించిన ప్రస్తావనే లేదు. ఆందుకే తమిళ ఉద్యమకారులు మాదిగల్ని కూడా 'వందేరిగళ్" (వలస వచ్చిన వారు) అంటుంటారు. ఏందుకో తెలియదుగానీ చరిత్రలో చిత్తూరు ప్రాంతంలో బలమైన తమిళ ఉద్యమమేదో జరిగింది. లేకపోతె ఇందరు తమిళూలు, ఇన్ని తమిళ జాతులు ఇక్కడ నిలబడి పోవడం జరుగదు. తమిళ ఉద్యమం బలంగా జరిగిందని సందేహపడడానికి ఇంకొక ముఖ్య ఉదాహరణ:

దళిత కులాల్లో 'మాదిగలూ ఉన్నారు కదా! తమిళనాడంతా కుడా వీరి తల్లిబాస తెలుగే. చిట్టచివరి కొస 'కన్యాకుమారీలో కుడా సుమారు వెయ్యిండ్లు మాదిగలవారు ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుకొంటున్నారు.

మరిన్ని వివరాలకు:

స.వెం.రమేశ్
తెలుగువాణి
7, రాజాజీ వీధి,
భారతీ నగర్ ఎక్సెటెన్షన్,
కాట్పాడి - 632 006
వెల్లూర్ జిల్లా, తమిళనాడు
ఫో:09443323517

ప్రచురణ : నడుస్తున్న చరిత్ర (జులై '06)

Read more...

వినాయక చవితి శుభాకాంక్షలు

>> Sunday, August 27, 2006



ఈ సంవత్సరమన్నా తనను చెరువుల్లో నిమర్జనం చేసి నీటిని కలుషితం చేయవద్దంటున్న
పర్యావరణ గణపతి.

Read more...

తుప్పు పట్టిన 'కారు'

>> Saturday, August 26, 2006

తుప్పు పట్టిన కారా? - అదేమిటి?

గుర్తు రావటములేదా?....కారండి---కారు----CAR .. మన చంద్రశేఖర రావు గారి గుర్తు., గులాబీ రంగు పై కారు....గుర్తొచిందా...?....హమ్మయ్యా...

దానికేమైందని అడుగుతున్నారా....దానికేమి కాలేదు...ఆల్రెడీ తుప్పుపట్టిన కారునుని బయటకు లాగీ...."ప్రత్యేక తెలంగాణా" ని మళ్ళీ మొదటికి తెచ్చారు.

కొంత కాలం క్రిందట "రక్తాన్ని ధారపోసైనా, తలలు బద్దలు కొట్టైనా ప్రత్యేక తెలంగాణాను తెస్తాము" అన్న చంద్రశేఖరుడు......

కొన్ని నెలల క్రింద " సోనియా కాళ్ళు పట్టుకొనైనా తెలంగాణా రాస్ట్రాన్ని సాధిస్తాము" అన్న శేఖరుడు

కొన్ని రోజులక్రితము మేడంగారిపై అలిగి, కోపంతెచ్చుకొని, రాజీనామా సమర్పించుకొని, నిరాహార దీక్ష చేపట్టి, అమవాస్య చంద్రునిలా చిక్కి,శల్యమై, లోకసభ మీద గౌరవంతో, నిరాహార దీక్షను విరమించి "శాంతి కపోతము" అయ్యారు.

"తెలంగాణా పై అనవసరపు రగడ చేయ్యొద్దని, పల్లె పల్లె కూ వెళ్ళి 'కాంగ్రెస్సు వారు, మేడం గారు' చేసిన మోసంగురించి, అన్యాయము గురించి ప్రజలకు వివరిద్దాము, దీనితో ప్రజలు నిజం తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారని, కావాలసిన్నని సీట్లు వస్తే, ప్రభుత్వమే దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇస్తుంది" అని చంద్రశేఖర రావు సెలవిచ్చారు...

ఇదిగో ఇలా చెప్పే పోయిన ఎలక్షన్లలో "కారుతో" ఓట్లు గుద్దించుకొందామని అనుకొంటె, పాపం అదేకారు గుద్ది, ఓడిపోయి, చావుతప్పి కన్ను లొట్టబోయిందని, తన గురించి, ప్రత్యేక తెలంగానా గురించి ప్రజలు ఏమనుకొంటున్నరో అని ఇంకా అర్ధం కావడములేదు...పాపం.!

ఖర్మకాలి కాంగ్రెస్సు తో జత కట్టి, ఎన్నికల్లొ ఓడిపోయి, పదవి రాక కొన్నాళ్ళు, రక్తము, తలలు, కాళ్ళు, చేతులు, నరకడం అని కొన్నాళ్ళు అనడము,పదవి వచ్చిన తరువాత దాన్ని వదులుకోలేక కొన్నాళ్ళు, వదిలిన తరువాత, తప్పనిసరై నిరాహార దీక్షకు పూనుకోవడం, ఒకటున్నర రోజులోనే విరమించుకోవడం, మళ్ళీ ఎన్నికలు అనడం చూస్తోంటె, నాకు చంద్రశేఖర రావు గారు ఇక్కడ ఉండవలసిన వారు కాదేమో అని అనిపిస్తోంది.

మరి ఎక్కడ అంటారా - ఎమో - ఏ వాపునైతే చూసి, బలుపు అనునుకొన్నాడొ, ఏ నగరాన్ని చూసి, తన రాజధానిని చేద్దము అనుకొన్నాడో, - అదే నగరపు నడి బొడ్డులో ఉన్న - హాస్పిటల్ - అదేందో మీకు ప్రతేకముగా చెప్పక్కరలేదు అనుకొంటా... అక్కడ ఉంటే మంచిదేమో ..!

Read more...

పాఠశాలలో మాదకద్రవ్యాలు ....

నిన్నటి "STAR NEWS" లొ పగిలిపోతున్న వార్త (క్షమించండి దీనినే Breaking News అంటారు)

ప్రాంతము: దేశ రాజధాని "డిల్లీ" నగరము...(మన పక్క సందు కూడా కావచ్చు)
సమయము: ఉదయము 10.45
వేదిక : ఒక పేరున్న పబ్లిక్ స్కూలు
కళాకారులు : కొందరు విద్యార్ధులు
ఉదయము 10.45., స్కూలు మైదానము లో విద్యార్ధుల జేబులలో 3 పొట్లాలు దొరికినాయి.

ఇంక ఇక్కడినుంచి స్టార్ న్యూస్ విలేఖరులదే కార్యక్రమము మొత్తము.

అసలు మాదక ద్రవ్యాలు అంటె ఏమిటి?,
ఎక్కడ దొరుకుతాయి?
ఎంత ఖరీదు చెస్తాయి?
ఎక్కువ పరిమాణం లొ కావాలంటె ఏమిచెయాలి?

"తెలియని వారికి కూడా అర్ధం అయ్యెట్టు బాగా తెలియచెప్పారు"

స్టార్ న్యూస్ కి ధన్యవాదములు - ఇంత చక్కగా విడమర్చి చెప్పినదానికి.

ఇంక అసలు విషయానికి వస్తే:

ఈ మాదకద్రవ్యాలు విధ్యార్ధులకు సులభముగా స్కూళ్ళ ప్రక్కనే దొరుకుతాయి. మనము మామూలుగా బిస్కెట్టులు, చాక్లెట్టులు కొనుక్కునే కొట్లలోనే దొరుకుతాయి.

ఇక సులభముగా దొరకు రకాలు :

నల్లమందు-అతి తక్కువ రేటు
గాంజాయి - తక్కువ రేటు
మరిజునా - మధ్యరకం (దీనినే cannabis అని కూడా అంటారు)
హెరాయిన్ - ఇది యువకులకు సంభందించినది (రేటు కొంచెం ఎక్కువ - ముఖ్యముగా soft ware/ call center/party animals వాడుతుంటారు)

ఇదేకదా అసలైన గ్లోబలైజేషన్.


తప్పెవరిది...

మాదకద్రవ్యాలను అమ్మే వారిదా?
వారిని పట్టుకోలేని నిఘా వ్యవస్తదా?
బడి ఆవరణ లోకి వాటిని రప్పించిన స్కూలుదా?
పిల్లలదా?
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలని క్రెచ్ (డబ్బులకు తల్లి కొరత తీర్చె, పిల్లలను సమ్రక్షిస్తున్నామనే కొన్ని సంస్థలు) కి అలవాటు చేసే, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడుతూ, పిల్లలకి ఏవి ఇష్టమో తెలుసుకోకుండా, మన ఇష్టాలను వారి మీద బలవంతంగా రుద్దే తల్లితండ్రులదా?

చివరిగా:

అమ్మయ్యా !!

భారత దేశాన్ని అమెరికాగా మార్చాలన్న మన ప్రయత్నం 90% సఫలీకృతమైనది.

చూడండి., అమెరికా లాగే మన స్కూళ్ళ లోనూ విరివిగా, విచలవిడిగా మత్తు దొరుకుతుంది, అదీకాక దేశం ఎత్తుకి ఎదగదానికి పిల్లలేగా ముఖ్యం....వారికే ఈ ఎరువు వేస్తే దేశం ఎంత అభివృద్ది చెందుతుందో...

Read more...

కడలి గుడికి కదలి పోయె గంగా!!

>> Tuesday, August 22, 2006

నిద్దురోతున్న కాశీ విశ్వేశ్వరుని షెహనాయి నాదంతొ మేలుగొలుపు గొంతు శాశ్వతముగా మూగబోయింది....

91 సం||ల భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈరోజు సూర్యోదయములొ అస్తమించి సంగీత సామ్రాజ్యాన్ని చీకటి లొకి నెట్టారు.


A man of tenderness, A man who believes in remaining private and who believes that musicians are supposed to be heard and not seen.

The legendary shehani maestro, attached to Varanasi’s Vishwanath Temple.

It was Khan Sahib who poured his heart out into Raga Kafi from Red Fort on the eve of India’s first Republic Day ceremony.

Where others see conflict and contradiction between his music and his religion, Bismillah Khan sees only a divine unity. Music, sur, namaaz is the same thing.

His namaaz is the seven shuddh and five komal surs. Even as a devout Shia, Khan Sahib is also a staunch devotee of Saraswati, the Hindu goddess of music.

Ustad Bismillah Khan is the third classical musician after Pt Ravi Shankar and Late Smt M S Subbulakshmi to be awarded Bharath Rathna, the highest civilian honour in India.

The gentle genius of Bismillah Khan is perhaps single handedly responsible for making Shehnai a famous classical instrument. Traditionally used to play music during marriages, Shehnai is the counterpart of south indian nadaswaram. It is also used to play music in temples.

Bismillah Khan is now one of the most respected musicians and well sought after. Yet his lifestyle has not changed. It retains the old world charm of a Benaras life ... his chief mode of transport is still the cycle-rikshaw !

అంత గొప్ప వ్యక్తికి,అశ్రునయనాలతొ వీడ్కోలు చెప్పడము తప్ప ఇంకేమి ఇవ్వగలను.

ఎవరో చెప్పినట్లు (శ్రీ వేటూరి గారే అనుకొంటాను)....


నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన


గుండెలో రంపాలు కోత పెడతాఉంటె
పాత పాటను మళ్ళీ పాడుకొందామంటూ


ఆది విష్ణు పాదమంటి, ఆకసాన ముగ్గుపెట్టి, జంగమైయ్య
జంట కట్టీ, కాశి లోన కాలుపెట్టి, కడలి గుడికి కదలి పోయె గంగా!!


"వారి ఆత్మకు శాంతి కలుగు గాక..!!"
"May His Soul Rest In Peace..!!"

Read more...

అందరూ ఆలోచించండి....

>> Saturday, August 19, 2006

నిన్నటి Times of India - Bangalore Edition లొ ఉన్న Times City అనే పేజిలొ We Got M@il అనే శీర్షక క్రింద వచ్చిన ఒక ఉత్తరాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఇది కేవలం బెంగళూరు కే కాదు., మన రాష్ట్రం లోని అన్ని పట్టణాలకు,మొత్తం దేశానికీ అవసరమే అని నేను భావిస్తున్నాను...


ఇది రాసినది, భారతీయుడు కాదు., ఒక విదేశీయుడు.., ఐనా ప్రక్క దేశమువాడు చెబితేకానీ, మనకు ఎక్కదుగా....

ఇంక ఉత్తరము చదవుదామా:

Don’t replicate America model
— Michael Dakin

As an Englishman who recently moved to your city, I seriously wonder whether any of the ideas expressed to improve the city will add up to creating a Bangalore a pleasurable place to live in. I get the feeling that it is wedded to the American version of a modern city rather than the European model. People always talk about infrastructure in terms of roads and addition of a Metro. How depressing!


In America, everybody drives everywhere. The concept of walking is totally alien. If you take major European city models, the pedestrian is king. Bangalore does not need more and wider roads; more flyovers and underpasses. It needs to look at how it can make the city a pleasure to walk around. For, just walking from my residence to a local shop is a nightmare. The fumes nearly choke you to death. The pavements are nothing more than broken stones and soil. Do Bangaloreans really believe American-style malls are a replacement for open walking spaces with trees and water fountains? They have a place, but there’s much more to a city than shopping malls.



ఐనా మనకి ప్రతీ దానిని ప్రక్క వాళ్ళతొ పోల్చడము చిన్నపటినుంచి వెన్నతో పెట్టిన విద్య.

పక్కింటి శీనుగాడిని చూడు...ఎంత బుద్దిగా, అన్నం తింటున్నాడొ - చిన్నప్పుడు అమ్మ చెప్పిన పోలిక..

ఒరే వెధవా, ఆ రాముగాడిని చూసైనా బుద్ది తెచ్చుకో - ఎంత బాగా మార్కులు తెచ్చుకుంటున్నాదో - స్కూలులో మాస్టారి గారి పోలిక..

నీతోటి వాడైన రవిని చూసి నేర్చుకో, ఎంతో కష్టపడి చదివి, ఎంత మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడో - నిరుద్యోగికి తండ్రి చూపే పోలిక.

ఇలా అడుగడుగునా పోలికలు పెట్టుకొని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్టు ఉంది మన పరిస్థితి.

మనమే, మన individuvality,identity పోగుట్టుకుంటున్నామేమో...
అందరూ ఆలోచించండి....

Read more...

మీరు సింగిలా?

>> Thursday, August 17, 2006

ఏం..! అర్ధం కాలేదా?

అదేనండి, ఈ మధ్య వచ్చిన జాఢ్యం ఉందిగా - అదే అమెరికను ఆంగ్లము ( English - American Style)...దాని గురించి....నా గోల, గోడు....

ప్రతీ కాల్ సెంటరు వాల్లు ఫోన్ చెసి " మీరు సింగిలా" అని అడుగుతారు...., వెంటనే నాకు .....


"నేను" అనే పదము - ఏక వచనమా ? బహువచనమా ?

నా శరీరము - లావుగా (Double Size) ఉందనా?

నేను ఎవరినైనా ఉంచుకొన్నాననా?

అనే ప్రశ్నలు పుట్టుకొస్తాయి...

ఇంతకీ దీని అర్ధం - మీకు పెళ్ళైందా అని...

ఇంతకు ముందే నయం, బ్రిటీషు వారి భాషలో మర్యాద ఉండేది....

"Are you married?" అని కానీ, married, unmarried అనే options కానీ ఉండేవి...

మరి ఇప్పుడో.....మంచి, మర్యాదా మచ్చుకైనా కానరావు...

ఏ భాష లొనైనా మంచి, మర్యాదా, గౌరవం, ఉన్నప్పుడే అందముగా ఉంటుంది....


ఇంకో రకముగా చెప్పాలంటె,

ఎంత అందగత్తైనా, భాషలో గౌరవము, మంచితనము, మర్యాద ఉంటేనే అందగత్తె అనిపించుకొంటుంది....

Read more...

ఫ్రీడం 59

>> Tuesday, August 15, 2006



59 వ భారత స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు.



ప్రతీ సంవత్సరం ఆగస్టు 15వ తేదినాడు, జెండా ఎగురవేయడము, పాత ఙాపకాలు తలచుకోవడము...ఇదేనా స్వాతంత్ర్యదినోత్సవము?

వీటిసంగతీ కొంచెము చెబుతారా?

1) గట్టి భద్రత మధ్య ప్రధాని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించడము....ఇదేనా స్వాతంత్ర్యం..?(ఇది మనకు ఏవిధమైన స్వాతంత్ర్యము?).

2) పేపర్లలొ "ప్రశాంతముగా స్వాతంత్ర్యదిన సంబరాలు" అని చదవడము - ఇదేనా స్వాతంత్ర్యం..?

3) అన్నీ రాస్ట్రాలలోనూ రైతుల ఆత్మహత్యలు - ఇదేనా స్వాతంత్ర్యం..?

4) అర్ధరాత్రి తిరిగే (ఉద్యోగాలనుండి ఇంటికి వెల్లె)ఆడవారి పై జరిగె అమానుష చర్యలు ...ఇదేనా స్వాతంత్ర్యం..?

5) క్లబ్బుల్లో, పబ్బుల్లో....మబ్బుల్లో తేలుతున్న యువత - ఇదేనా స్వాతంత్ర్యం..?

6) అభ్యంతరకరమైన నాట్యాలు చెసిందని గొంతెత్తి అరిచిన మహిళా సంఘాలు, T.V.Channels, ఐశ్వర్యా రాయ్, ప్రీతీ జింతా, కరిష్మా మెదలు నిన్న వచ్చిన పార్వతీ మిల్టన్ వరకూ వేసుకొనే కురచ దుస్తులు అభ్యంతరముగా అనిపించలేదా - ఇదేనా స్వాతంత్ర్యం..?

7) ఎందుకు చంపుతున్నామో, ఎందుకు ఛస్తున్నామో అర్ధం కాని పరిస్థితిలొ ఉన్న పోలీసు, నక్సలైటు, హొం డిపార్టుమెంటు - ఇదేనా స్వాతంత్ర్యం..?

8) కులం పేరుతో తిట్టారని, మీ ఊరి అంతుచుస్తాను అన్న MLA - ఇదేనా స్వాతంత్ర్యం..?

9) ఎంత గొప్ప వ్యక్తిని హత్య చేసినా, క్షమాభిక్ష పెట్టె సుప్రీం కోర్టు

ఇలా చెప్పుకొంటూ పోతె...59 ఏళ్ళు సరిపోవు....

అందుకే

అర్ధ శతాబ్దపు అగ్నానాన్ని స్వతంత్రమందామా? స్వర్నోత్సవాలు చేద్దామా?
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా? దానికి సలాము చేద్దామా?
శాంతికపోతపు కొత్తుక త్రెంచి తెచ్చిన బహుమానం
ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మ ఓ పవిత్ర భారతమా

కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి తగువుకి లేస్తారే
జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకు తనం లొ
ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే?, తెలిసి భుజం కలిపి రారే?
అలాంటి జనాల తరఫున ఎవరొ ఎందుకు పోరాడాలి?
పోరి ఏమిటి సాధించాలి?

ఎవ్వరికోసం ఎవరు ఎవరితొ సాగించే సమరం
ఈ చిచ్చుర సిందూరం జవాబు చెప్పె భాద్యత మరచిన
జనాల భారతమా ఓ అనాధ భారతమా

తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే
వదులుకొని తనలో భీతిని, తన అవినీతిని
తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచె జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదొ తనకె వుందని శాసిస్తుందట అధికారం
క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాధ భారతమా?




-----జై భారత్ ------

Read more...

ఓ సారూ ! జరంత భద్రం !!!!

>> Thursday, August 10, 2006

హల్లో! గురూగారూ..

ఈ హెడ్డింగ్ చూసి ఎదో అనుకోవద్దు.!

మన గవర్నమెంటు ఈమధ్య ఒక గొప్ప కార్యక్రమం చేపట్టి, విజయవంతముగా కొనసాగిస్తూ ఉన్నది...అదేమంటారా.., ఈదిగో ఇక్కడ చూడండి & చదవండి "ఆదివారం - ఆంధ్రజ్యోతి".

ఇది చాలా గొప్పవిషయమా కాదా..?

అవును.....చాలా గొప్పవిషయం....

దీనితో తెలుగును మృత భాష కాదు అని వాదించవచ్చు...,
తెలుగు చాలా పురాతనమైన బాష అని నొక్కి వక్కాణించవచ్చు..,
దానితొ కేంద్రం నోరు మూయించవచ్చు...,

తెలుగుకు రావలసిన స్టేటస్ తీసుకురావచ్చు...(దీనివలన శ్రి వేటూరి.సుందరామ్మూర్తి గారి గౌరవాన్ని (రాష్ట్రీయ పురస్కారాలు)కాపాడుకోవచ్చు..,

గ్రాంటులు కూడా పోందవచ్చు...అనుభవించొచ్చు....

(నువ్వా..నేనా అనే ప్రశ్నలు వద్దు...అవి మనకి కాదు....పెద్దమనుషులు ఉన్నారులే.., దానికోసం ....)
(ఏమిటి...ప్రసాదు గారికా... వస్తుంది...వస్తుంది.."గొంతు నొప్పి".)

ఒరే అనీలు... ఏమిట్రా., పైన పెట్టిన హెడ్డింగు కు నువ్వు చెప్పే విషయానికి ఏమి సంబంధం.., ఏమిటీ సోది అంటారా (సోది నాది కాదు....చావా కిరణ్ గారి బ్లాగు పేరు....) ఇది సోది కాదు...బాధ...

బాధా...?ఇంత మంచి యఙ్ఞం జరుగుతుంటేను....?

అది కాదు సారూ... మనకు తెలియదా, మన ప్రభుత్వ కార్యాలయాలలో కాగితాలకు పట్టే అదృష్టం......

ఇప్పుడే...ఫ్యాక్టరీ నుంచి వచ్చిన తెల్ల కాగితము కుడా పది నిముషాలలో తాళపత్రం (అంటె...రంగుమారి Brown గా మారుతుంది) అయిపోతుంది... అలాంటిది., పురాతన తాళాపత్రాలు, కాగితాలు అంటె..... ఏమవుతాయో?

ఎంతో భక్తి తో, ప్రేమతో, గౌరవం తో భద్రపరచుకున్న ఈ సంపదను వారికి ఇవ్వడం అంటెనే... బాధ......అందుకే "ఓ సారూ...జరంత జాగ్రత్త.".

తరువాత ఏమి జరుగుతుందో.....పెరుమాళ్ళకే ఎరుక....

Read more...

తొలి తెలుగు తీర్పు

రాయులు ఏలిన సీమ "రాయల"సీమలొ మొట్టమొదటి సారి గా తెలుగులో తీర్పు........ప్రాంతీయ బాషాభివృద్ధి కి తొలి మెట్టు....


"ప్రాంతీయ బాషాభివృద్ధి కి ప్రాంతీయ బాషాలోనే తీర్పులు", అని చెప్పిన అంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పిలుపునకు స్పందించి రాయలసీమలొ మాతృబాషలొ తీర్పునిచ్చిన శ్రీయుతులు. జి.రవీందర్ గారికి నా అభినందనలు, ధన్యవాదములు.

ఈ విప్లవం అన్ని ప్రాంతాలలో రావాలని కోరుకొంటున్నను....

వివరములకు : అంధ్రజ్యోతి దినపత్రిక - సీమలొ తెలుగు తీర్పు

Read more...

రోడ్డు - మీరు

>> Friday, July 28, 2006

రోడ్డు పై వాహనము నడిపేటప్పుడు

1. ఎటు వైపు నుంచి నడపాలి?
2. ఫోన్ (సెల్ /మొబైల్) మాట్లాడొచ్చా?
3. వాహనము నడిపేటప్పుడు ఇయర్ ఫోన్ (మొబైల్/వాక్ మెన్)ఉపయోగించవచ్చా?

4. వాహనము నడపడానికి కనీస వయస్సు ఎంత?
5. ఎంత వేగముతో వాహనము నడపాలి?, కనీసం పాఠశాలల వద్ద ఎంత వేగము అవసరము?
6. రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ లైట్లు ఏవరికోసం, ఎందుకోసం, ఎవరు పెట్టారు?
7. ఏ రంగు లైటు పడితె, ఏమి చెయ్యాలి?
8. ముందు వాహనాన్ని ఎటువైపునుంచి over take చెయ్యాలి?
9. ఎక్కడ వాహనాన్ని park చెయ్యాలి?
10. వాహనము మీద ఎంత మందిని ఎక్కించుకోవాలి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుసా? తెలుసనే అనుకొంటాను. ఎందుకంటె మీరు చదువుకొన్నవారు, విఙ్ఙానవంతులు...

అన్నీ తెలిసిన మీరుకూడా వీటిని ఎందుకు అతిక్రమిస్తారు? చదువు ఎక్కువైందా?
(చదవక ముందు కెకరకాయ అనేవాడు ... చదివిన తరువాత ఇంకెదో అన్నాడట).

Read more...

భీతిల్లిన భారతం

>> Wednesday, July 12, 2006

ఛిద్రమైన తల, నుజ్జు నుజ్జైన నడుము,ఎవరిదీ శరీరము?నీదా? నాదా?, కాదు కాదు....ఆ శరీరము ఎవరిదొ కాదు....నా తల్లి భారతి ది.

రోజూ నా తల్లి తల ఎర్ర సింధుర తిలకపు ఎరుపు తొ శొభాయమానముగా కనిపించె ఆ నుదురు ఈనాడు కూడా ఎరుపుగానే కనిపిస్తోంది, కానీ ఈ ఎరుపు కుంకుమ వలన కాదు, రక్తముతో.

ఎంతో అందముగా కనిపించే ఆ నడుము, ఈనాడు నెత్తురొడుతోంది.

ఎందువలన?......తెలియదు.

ఎవరివలన? .......తెలియదు.

మరింకేం..తెలుసు?

అర్జెంటు గా, tiffin చెసి, ఆఫీసుకు వెళ్ళాలి...
సాయంత్రం, పిల్లలని బజారుకు తీసుకు వెళ్ళాలి...
మర్చేపోయాను, ఈరోజు సుధీరు వాళ్ళ ఇంటికి భొజనానికి వస్తాను అని అన్నాను...

మరి, శ్రినగర్, ముంబాయి లలొ జరిగిన విషయాల గురించి ఎమనుకొంటున్నవు?
ఆ యేముంది, ఈ దెశంలొ ఈ రకపు చావులు, విధ్వంసములు మామూలే...

మరి నీవు ఎమీ చెయవా?
...ఛోడొ...యార్!...


మనకంటె, మానవత్వం మూర్తీభవించిన ముంబైవాసులు మేలేమో...అవసరానికి తోటివారిని ఆదుకుంటున్నారు...మరి మనము ఎమిచెయాలి..?

కనీసము...

ఈ విధ్వంసాలని ఖండించాలి...
మరణించిన వారి ఆత్మశాంతి కోసము 2 నిముషాలు మౌనము పాటించాలి...

మరి చేద్దామా?

Read more...

నీతోనె

>> Tuesday, July 11, 2006

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ "ISRO" మొన్న సాయంత్రము ప్రయోగించిన GSLV F-02 అంతరిక్ష నౌక విఫలం అయినదని అందరికీ తెలుసు, ఆ విషయము మీద, మన జర్నలిస్టులు, T.V న్యూస్ రీడర్లు తెగ బాధ పడిపోతున్నారు, నిన్నటి నుంచి ప్రతీ 5 నిం.లకు ఒకసారి అవే క్లిపింగులు... వార్తా పత్రికలలో హెడ్డింగులు.

"ఈ ప్రయోగానికి 256 కోట్లు వ్రుధా అయ్యాయి" - ఆంధ్రజ్యోతి (ఇది హెడ్డింగు కాదు సుమా!)

ఇది చాలా భాధాకరమైన వాఖ్య, కోట్ల మంది భారతీయులు పడని బాధంతా వీరే పడుతున్నరు....."FAILURE IS THE STEPPING STONE FOR SUCESS" అని ఎప్పుడు తెలుసుకొంటారో...

అందుకే ISRO కి చిన్న ఉత్తరం:

ప్రియమైన ISRO శస్త్రవేత్తల్లారా, మేధావుల్లారా, ముఖ్యముగా భారతీయులారా,

పదండి..ముందుకు ..పదండి..త్రొసుకు...పోదాం పోదాం పైపైకి....
ఇవన్ని చాలా చిన్న విషయాలు..ఏనుగులు వెళుతూ ఉంటె కుక్కలు మొరుగుతాయి, మీరు సాధించిన విజయాలముందు, ఈ విమర్షలు చిన్నబోతాయి....!
మీ విజయము,అపజయము లొ లో మేము కుడా పాలు పంచుకొంటాము., మేతొ మెమున్నాము...
చిన్న చిన్న అపజయాలకి చిన్నబోకుండా, క్రుంగకుండా, భాధ పడకుండా...సాగిపోండి.....

ALL THE BEST

మీ సోదర భారతీయుడు
అనిల్ చిమలమఱ్ఱి

Read more...

శ్రీ జే.పి. గారికి చిన్న సలహా

>> Friday, July 07, 2006

నిన్న 3 పాయింట్లు (నేరచరితులు,చట్టసభల గౌరవం,మరియు వ్యవసాయం & పరిశ్రమల గురించి)చెప్పుకున్నాము...ఇలా చెప్పుకొంటూ పోతె ఇంకా చాలా చెప్పాలి....అందువలన ఈ విషయాన్ని ఇక్కడే వదిలేస్తాను....వదిలే ముందు చిన్న విషయం చెబుతాను...
ఒక మనిషి నేరస్తుడు లేక మహాత్ముడు, విద్యావేత్త లేక దగుల్బాజీ, రాజకీయనాయకుడు లేక నక్సలైటు అయ్యాడంటె దానికీ కొన్ని కారణాలు ఉంటాయి. ఆందులో కొన్ని ఇక్కడ చెబుతున్నాను.
1. తల్లిదండ్రుల పెంపకం..: ప్రతీ తల్లి-తండ్రి తన కొదుకు/కూతురు ఇంజనీరో/కలెక్టరో/లేక ఇంకేదొ కావాలని అనుకొంటారె తప్ప ఒక మంచి మనిషి, ఇతరులకు సహయపడె మనిషి కావాలని అనుకోరు.....దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెదతారు.. రండి ఒక పదిమంది విద్యావేత్తలు వారి పిల్లలని ప్రభుత్వ పాఠశాలలొ చేర్పించి ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెట్టండి....పిల్లలు, ప్రభుత్వం ఉన్నత స్థితి లోకి ఎందుకు రావో చూద్దాము.
2. టీచర్ల, ఉపాధ్యాయుల భోధన..: ప్రస్తుతము ఎక్కడ చూసినా పోటీ తత్వమే...LKG లొ చేరాలన్నా ఇంటర్వ్యూలే..పరీక్షలే... స్కూలుకు మంచి పేరు/ఆదాయము రావాలంటె మంచి ర్యాంకులు రావాలి.....ర్యాంకులకి మంచి పద్దతి ప్రష్నలు బట్టీ పట్టించడమే, లేక రొజూ పరీక్షలే (అదేనండీ mock tests)...ఈ చదువును చూసి మా తాతగారు " Education is the botheration for the nation, so cultivation is the best occupation" అని...నిజమే కదా...
ఐనా "Co-operation is better than Competition" అని ఎప్పుడు తెలుసుకుంటారో?
3. తన చుట్టూ ఉన్న సమాజం..: అవినీతి ఎక్కడ మొదలైంది? మన నట్టింట్లొ...అంటె ఉరుకొంటారా?....కానీ ఇది నిజమైన నిజం,అదెలా అంటారా...పిల్లవాడు బడికి పోనని మారాం చేస్తుంటే, అమ్మ, నాన్న "నువ్వు ఇప్పుదు బడికి వెడితే సాయంత్రం పార్కుకి తీసుకెళతా" అని అనడం తొ మొదలు.....అదె పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఆఫీసులొ నాకేంటి అని అడుగుతాడు. ఇది చాలదా ఉదాహరణకి?
4. కాలం..: నేను ఎక్కడో చదివా..."మనిషి మార్పుకు కారణం తో పనిలేదు...కాలమే ఆ పని చేస్తుంది" అని..బడిలో చదువుకొనేటప్పుడు ఉన్న సాటి మనిషి మీద ఉన్న ప్రేమ, అభిమానాలు కాలేజీ కి వచ్చిన తరువాత కనపడవు....ఎందుకు?
చివరిగా చెప్పోచ్చేదెమిటంటే...శ్రీ జే.పి.నారాయణ గారు క్రొత్త పార్టీ పెట్టి చేతులు కాల్చుకొనేకంటె, ప్రజలను చైతన్యవంతులని చేసి చరిత్ర లో నిలబడి పోవటం మేలని నా ఉద్దేశ్యం.
ఇక ఈ విషయాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను....

Read more...

నిన్నటిదే ....

>> Thursday, July 06, 2006

లోక్ సత్తా (స్వచ్చంధ సంస్థ) జరిపిన చర్చ లొ అన్నీ నిజాలే...కానీ ఆ ప్రశ్నలలో చాలావాటికి జవాబులు దొరకవు.

1. రాజకీయం కేవలం అవినీతిపరులకి, అక్రమార్జనపరులకి, నేరచరితులకేనా?
నేరచరితులంటె - కోర్టులలొ కేసులున్నవారా, శిక్ష అనుభవిస్తున్నవారా?,
కోర్టులలొ కేసులున్నవారైతే - ఆ కేసులు ఈ జీవితానికి పూర్తి కావు...
శిక్ష అనుభవిస్తున్నవారైతే - మన రాజ్యాంగం ప్రకారం వారు ఎలక్షనులలొ పాల్గొనవచ్చు అని ఉంది కదా...(ఉదా:- చాలామంది ఆవిధం గా గెలిచినట్లు చరిత్ర చెబుతున్నది, అసెంబ్లి రౌడి అనె సినిమాలొ-హీరొగారు జైలునుంచె నామినేషన్ వేసి గెలుస్తాడు).

2. మంట గలసిన చట్టసభల గౌరవం
దేశంలొ సుప్రీం కోర్టు గొప్పదా, పార్లమెంటు గొప్పదా అన్న విషయానికే కరెక్టుగా జవాబులేదు...(ఉదా:- ఈ మధ్యనే జరిగిన, ముడుపుల భాగొతం)
అసలు సంవత్సరానికి ఎన్ని సార్లు అసెంబ్లి జరుగుతుంది?, దానిలొ ఎంత సేపు ప్రశ్నోత్తరాల కార్యక్రమము?, ఎన్నిసార్లు baycott చేస్తున్నారు?,

బడికి వెళ్ళే పిల్లవాడు (పిల్లలంటె మాములుగా బరువు, భాద్యతలు లేనివారని ఇక్కడ అర్ధం) రోజుకు 6 గంటలు, వారానికి 5/6 రోజులు, నెలకి 4 వారాలు వెలుతుండగా ....అన్ని భాద్యతలు కలిగిన రాజకీయనాయకుడు ఎంతసేపు అసెంబ్లిలొ ఉండాలి?

మాములుగానే భాష మనము కోపము లో ఉంటె కుక్క, పంది, దున్నపోతు అని తిట్టుకొంటాము ..... మరి అసెంబ్లి లొ మరీ కోపమువచ్చినప్పుడు.... ఎమి తిట్టాలి?.....స్పెషల్ గా భాష కనిపెడదామా?, అసలు కోపము ఎందుకు రావాలి..., ఏం! మీకు ఆఫీసులొ ఎప్పుడూ కోపం రాదా?....ఇదీ అంతె!

3. వ్యవసాయ రంగం / చిన్న పరిశ్రమలు

దీనికి కారణం మధ్యవర్తులా, రాజకీయనాయకులా,గ్లోబలైజెషనా, లేక, రైతా....
మాములు పంటలు పోయి, కమర్షియల్ పంటలు వచ్చె ...ఢాం...ఢాం...ఢాం.
మాములు పద్ధతులు పోయి, శాస్త్రీయ పద్ధతులు వచ్చె ...ఢాం...ఢాం...ఢాం.

పురుగుల మందు పోయి, కొకాకొలా వచ్చె ఢాం..ఢాం...ఢాం
మిగతాది రేపు....

Read more...

నూతన రాజకీయ సంస్కృతి ఆవశ్యకత....!

>> Wednesday, July 05, 2006

నూతన రాజకీయ సంస్కృతి ఆవశ్యకత....!

ప్రజారాజ్యం (లోక్ సత్తా అను ఒక స్వచంద సంస్థ / నూతన రాజకీయ పార్టీ వారి సమాచార పత్రం)నిరుటి నెల అనగా జూన్ లొ ఒక చర్చా పత్రం ప్రచురించింది, దాని పేరే " నూతన రాజకీయ సంస్కృతి ఆవశ్యకత".

ఈ చర్చను ఇప్పుడెందుకు తెచ్చారో నాకు మాత్రం అర్ధం కావడంలేదు, "ఇది వారి రాజకీయ ప్రవేశ ప్రయత్నమా....అని అనుకుంటూ ఉండగానే" శ్రీ జె. పి. నారాయణ్ గారు (కన్వీనర్, లోక్ సత్తా) పేపరుకి ఎక్కేసారు... మైకు పట్టుకొని మరీ....త్వరలో మనం శంఖం పురిద్దాము... అంటూ.

"వస్తోన్నాయ్...వస్తోన్నాయ్...జగన్నాధుని రధచక్రాల్" అని ఎవరిని భయపెడుతున్నాడొ అర్థం కావటం లేదు... ఎలక్షనులొ గెలవటం అంటే I.A.S పాసు ఐనంత సులువు కాదు అని తెలియదెమో?
ఈయనకి మంది మార్బలము లేదు, ఉన్నదెమో తొక్కలొ చదువుకున్నావారు, జెండా పట్టుకు తిరగడానికి సిగ్గుపడేవారు.. ఇంకేమి గెలుస్తాడు.... నా మొహం ...!

ఐనా ఎమాటకమాటే చెప్పుకోవాలి, జె.పి. తెలివిని మెచ్చుకోవాలి.....ఎంతైనా I.A.S తెలివి....తన రాజకీయ ప్రవేశం కోసం 3, 4 సం నుంచే పునాది వేసుకొంటూ వచాడు...(నిఝ్ఝం గా, అచ్చంగా ఇది నా అభిప్రాయం....ఒట్టు తను లోక్ సత్తా పెట్టినప్పుడు, కొంచెం పేరులొకి వచ్చినప్పుడు... నా స్నెహితులకి ఇదే చెప్పాను)......

మిగతాది రేపు చదవండి..

Read more...

మా తెలుగు తల్లికి మల్లెపూదండ ...!!!

>> Tuesday, July 04, 2006

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ సిరులు దొరలించు మా తల్లి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

గల గల గోదారి కదలిపోతుంటేను
బిరబిర క్రిష్నమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలె పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులొ తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తీఅందనాలు
నిత్యమై నిఖిలమై నిలచివుండెదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, క్రిష్ణరాయల కీర్తి
మాచెవులు రింగుమని మారుమ్రోగెదాక
నీ ఆటలె ఆడుతాం...నీపాటలె పాడుతాం

జై తెలుగు తల్లి!
జై తెలుగు తల్లి!
జై తెలుగు తల్లి!!!

----శంకరంబాడి సుందరాచార్య


నా ఈ బ్లాగు ని తెలుగు లో వ్రాయాలని అనుకొంటూ ఈ ప్రార్థనా గీతం తొ ప్రారంభించాను..
పోతనామాత్యుడు చెప్పినట్లు (కానీ కొంచెము మార్చి)

"పలికెడిది తెలుగట, పలికించెడిది ఆంధ్ర భారతట"
చూద్దాము.., ఈ ప్రయాణము ఎంతవరకో..

జై తెలుగు తల్లి..!! (దాసరి నారయణ రావు పార్టీ కాదండొయ్)

Read more...