అవును..చేరాను...మోపెడ్ కొంటానా?

>> Tuesday, November 21, 2006

పట్టణంలో ఉద్యోగం చేస్తున్న ఒక తమ్ముడు...'మహాదర్శి చిట్‌ఫండ్' లో చేరాడు..ఈ మధ్య తను చాలా బాధపడిపోతున్నాడు. చేరిననాడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఆవగింజంతైన లేదు..తన అక్క తగు సలహా ఇస్తుందని ఆమెకు ఫోన్ చేసాడు...ఆ సంభాషణే ఇది...

తమ్ముడు: అక్కా బాగున్నావా?

అక్క : ఆ.. బాగున్నాను...అదేంటీ? అలా డల్‌గా మాట్లాడుతున్నావు?

తమ్ముడు: అవునే...ఇంతకీ నేను మోపెడ్ కొంటానా లేదా ...నువ్వన్నా చెప్పవే..

అక్క: అదేంటిరా...నిక్షేపంలా కొంటావు...అదేదో దర్శిలో చెరావుకదా..డబ్బుకూడా కడుతున్నావు...

తమ్ముడు: అదేనే...కానీ ఈమధ్య పేపర్లు, టీవీ లు చూసి పిచెక్కుతుందే...నీకుతెలుసుగా...మా బాస్ కూడా ఈ దర్శిలో చేరి సొంతంగా కారు కూడా కొన్నాడే... మొన్నొకసారి కనపడి కారెక్కమంటే...నాకు చిర్రెత్తు కొచ్చి శపధం కూడా చేసేశాను.

అక్క: ఏమనిరా...?

తమ్ముడు: నేను మహాదర్శి లో చేరతాను...మోపెడ్ కొంటాను అని..

అక్క: మరి ఇంకేమిరా....ఆ చిట్ ఫండ్ లో చేరావు...డబ్బు దాచి పెడుతున్నావు...మరి ఇప్పుడు..ఆ అనుమనము ఎందుకు వచ్చింది?

తమ్ముడు: డౌట్ రాదా మరి...పేపర్లలో ఒకాయనేమో నిబద్ధత అంటాడు, నిజయతీ అంటాడు....నిప్పులాంటిది మా నిజయతీ అంటాడు.. మరోపక్కేమో ఇంకోపెద్దాయన వాజ్యమటాడు..లెక్కలు చెప్పమంటాడు.

అక్క: అవున్రా! మీ బావగారు కూడా రోజూ పేపర్లు తిరగేస్తూ, టీవీ చూస్తూ తెగ కామెంట్లు, గంటలకొద్దీ పీకేస్తున్నారు..మీడియా మొత్తం రెడుగా చీలిపోయిందటగా..?

తమ్ముడు: అవునే.., ఒక పేపర్ తిరగేస్తే..రాముడు సత్యసంధుడిలా కనిపిస్తున్నాడు..ఆయన మాట రామబాణం అని పిస్తోంది..మరొక పేపర్ చూస్తే ఆయన మాటకు భరోసా లేదేమో అనిపిస్తోంది...

అక్క: అవున్రా...అంతా రాజకీయమంటున్నారు...

తమ్ముడు: నమ్మకం మావైపు ఉండి...తేడా పాడాలు లేని ఘన చరిత్ర మాది..అసంబద్ధ, అహేతుక ఆరోపణలు చేయడం మంచిది కాదు..అని సదరు కంపెనీ అధిపతి అంటున్నారే, రాజకీయం చేస్తున్నారు..,దురుద్దేశంతో దొంగ దెబ్బ కొట్టాలని చూస్తున్నారు..అని ఆయన అంటుంటే...నేను అడిగింది మామూలు ప్రశ్నలే..చెబితే పోలా, ఎందుకీ అనుచిత భాషాప్రయోగాలు అని మరొకాయన వాదన...

అక్క: అవునూ., ఇద్దరూ చెరొక బహిరంగ లేఖలు వ్రాసారు కదరా...ఆరెండూ చక్కగా పక్కనపక్కన పెట్టి చదువుకోరా..ఏమన్నా అర్ధం అవుతుంది...

తమ్ముడు: అలా చేసిన నా సమస్య పరిష్కారం కావడం లేదే..!

అక్క: పోనీ, ఒక పని చేస్తే పోలా?...

తమ్ముడు: ఏమిటది.?

అక్క: నువ్వు కూడా ఓక బహిరంగ లేఖ రాసి పడేయ్. పత్రికల వాళ్ళూ, టీవీ చానెళ్ళ వాళ్ళూ బోలెడంత ప్రచారం ఇచ్చేస్తారు.

తమ్ముడు: ఏమని రాయనే..

అక్క: వెధవా ..! BA చదువుకున్నావు...అదికూడా నేనే చెప్పాలా?...పైనాన్స్ 'ఫైట్' లో ఇరుపక్షాలు ఎత్తుకు పైయెత్తులు వేసుకొంటున్నాయి. రాజ్కీయ పావులు చక చకా కదులుతున్నాయి. 'చిదంబర' రహస్యాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. ఈ అర్ధిక సమరంలో ఎవరు ఎప్పుడు ఏ వ్యూహం వేస్తారో అంతుపట్టటంలేదు..చివరకు పద్మవ్యూహమో అభిమన్యునిలా 'మదుపుదారుడు' కాకూడదు.

తమ్ముడు: మదుపుదారుడా?...మధ్యలో వాడెవడే..?

అక్క: మీ బావగారు పేపర్ల భాషంతా నా చెవుల్లోకెక్కిస్తూ వుంటే...అలాంటి పదాలే వస్తాయి.నువ్వేమీ కంగారు పడకు...మదపుదారుడంటె..డిపాజిటర్ అని అర్ధమట..

తమ్ముడు: అర్ధం అయిందిలే... అంటే..డిపాజిటర్గా ఒక బహిరంగ లేఖ వ్రాయాలి అంతేకదా.

అక్క: అవును.., ఎవరి ప్రయోజనాలను వాళ్ళు చూసుకొంటూ, మనల్ని నట్టేట ముంచుతారేమో....

తమ్ముడు: (ఆవేశంగా) అలా కానీయను., రాసేస్తాను. మధ్యలో మనమెందుకు మునిగి పోవాలి?, మనమెందుకు ఆందోళన పడాలి?, B.Pలు పెంచుకోవాలి? నేనూ మోపెడ్ కొనుక్కోవాలంటే...గగ్గోలు చేయాల్సిందే...తెగువ చూపాలసిందే..

అక్క: ఒరేయ్! అంతగా అవేశపడకు...రాస్తావ్..కానీ నీ లేఖను...ఏ పేపర్ వాళ్ళు వేస్తారు?...ఇప్పుడున్న మీదియ అంతా చెరో పక్షాన ఉండి క్షణం తీరిక లేకుండా పేజీలకు పేజీలు నిపేస్తున్నారు..టివీల్లో గంటగంటకూ చెవులు ఊదర కొట్టేస్తున్నారు... నీ గురించి ఎవ్వరు పట్టించుకొంటారురా...?

తమ్ముడు: అవును ఎవరు పట్టించుకొంటారు...?...హల్లో.. హల్లో..అక్క మాట్లాడవే ....

(లైన్ కట్ అయింది)

Read more...

యశ్ భారతి




'యశ్ భారతి' ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర యువతకు ఇచ్చే ఒక అవార్డు...ఈ ఏడాది మహమ్మద్ కైఫ్ (క్రికెటర్), అభిషేక్ బచ్చన్‌లకు ప్రదానం చేసారు...

ఈ విషయమై ప్రతిపక్షాలు తమ నిరసన తెలియ చెశాయి...

నిరసనా..?....ఎందుకు?

ఎందుకేమిటి?

అభిషేక్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ వాడు కాదన్న వాదన...వారిది...

ఇంకో ముఖ్యమైన విషయము ఏమిటంటే .....

బచ్చన్ వంశంలో ఈ అవార్డు అందుకున్నావారిలో అభిషేక్ నాలుగోవాడు...
1. హరివంశ్ రాయ్ బచ్చన్ (అభిషేక తాతగారు, అమితాబ్ తండ్రిగారు)
2. అమితాబచ్చన్ (అభిషేక్ తండ్రిగారు)
3. జయా బచ్చన్ (అభిషేక్ తల్లి గారు)
4. అభిషేక్ బచ్చన్

(పాపం శ్వేతా బచన్‌న్ని (అభిషేక్ అక్కగారు) ఎందుకు వదిలేసారో?)

మరియొక ముఖ్య విషయం

అభిషేక్ తల్లి గారు..జయా బచ్చన్...ఉత్తరప్రదేష్ పాలక పక్షమైన సమాజవాదీ పార్టీ తరఫున 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' (యం.పి).

అభిషేక్ తండ్రి, అమితాబచ్చన్ ....ఈ రాజకీయ పార్టీ లో మంచి పలుకుబడి ఉన్నవారు.. సంఝ్వాదీ పర్టీ లోని అతి ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి 'అమర్ సింగ్' కి అత్యంత ఆప్తుడు.. అమితాబ్ అప్పుల ఊబిలోంచి బయటకు రావటంలో ఈయన హస్తం ఉందని ఒక సమాచారము...

ఏమిటొ ... నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరైనా అట్టాంటి పదవుల్లో ఉంటే...నేను కూడా..ఒక 'యశ్ భారతో, పద్మశ్రీనో, పద్మబూషణమైన దక్కించుకొనే వాదిని...ఇవికాకపోతె, కనీసం 'బారత రత్న' ఐనా తెచ్చుకొనేవాడినిగా...



కొసమెరుపు : ఈ అవార్డుతో వచ్చే నగదు బహుమతిని (5 లక్షలు.) ప్రభుత్వం నిర్వహించే సాంఘీక సంక్షేమమ పధకాల్లో ఉపయోగించమని అభిషేక్ కోరారు...

Read more...

అర్ధం కాని అవార్డుల భాగోతం

>> Sunday, November 12, 2006


ఎట్టకేలకు 2005 సంవత్సరానికిగానూ నంది అవార్డులు ఇచ్చేశారు ....తన్నుకు చావండి...
తన్నుకోవడామేమో కానీ ఈ అవార్డులు ఏ ప్రాతిపదికనిచ్చారో అర్ధం కాక జుట్టు పీక్కొంటున్నాను.. మీకేమైన అర్ధమైతే తెలుపవలసినది...

ఉత్తమ హీరో - మహేష్ బాబు
చిత్రం - ఆతడు

విచిత్రంగా మనుషులని చంపే పాత్రలకే అవార్డులు వస్తాయేమిటో... ఐనా ఈ చిత్రం లో హీరో గారి పాత్ర 'మొహములో ఏ భావనలూ కనపడనిది"...దీనికి మహేష్ బాబు సరీగానే న్యాయం చేసాడు అని అనుకొందాం...ఈ జ్యూరీకి ఈ భావాలు పండించని ఈ పాత్రకి, ఈ మనిషి కి ఎలా అవార్డు ఇవ్వాలనిపించింది...?

ఉత్తమ దర్శకుడు - కృష్ణవంశీ
చిత్రం - చక్రం

ఇది మరో విచిత్రం ... కీ.శే. హృషీకేష్ ముఖర్జీ తీసినటువంటి "బావర్చి" నుండి inspiration పొంది (దీనిని inspiration అంటారా copy అంటారా?) కొంచెం ప్రేమ, కొంచెం చేజింగ్లు పెట్టి తీసిన సినిమా. ఈ జ్యురీ కాపీ సినిమలకు కూడా అవార్డులు ఇస్తే దీనికంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయిగా.

దిక్కు లేని "NTR" అవార్డ్...

మహానటుడు నందమూరి తారక రామారావు అవార్డు ఏ నిముషంలో పెట్టారో..పాపం ఎప్పుడు అవాంతరాలే...దీనిగురించి ఇంకోసారి మాట్లాడుకొందాం.

స్పెషల్ జ్యూరీ అవార్డు - వడ్డే నవీన్
చిత్రం -
ఊపిరి


దీని గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది...మిగతాది మీ ఊహ కే వదిలేస్తున్నాను..

చివరిగా అతి ముఖ్యమైనది - ఎవరికీ అర్ధం కానిది

ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం - పెళ్ళాం పిచ్చోడు

ఈ సినిమా విదుదలైనది 2006 (అవార్డు వచ్చినది 2005 సం.) ఈ సినిమ ఒకటి రెండు హాళ్ళలో మాత్రమే విడుదల అయినది, రెందు మూడు రోజులే ఆడిండి.. మరి ప్రజాదరణ ఎలా పొందింది?


ఓ దేవుడా .. మా మంచి దేవుడా ...
చూడడానికి సినిమానిచ్చావ్
పీక్కోవడానికి జుట్టు ఇచ్చావ్
ఎందుకు ఈ నందీ అవార్డుల జ్యూరీనిచ్చావ్?

Read more...

రోడ్డెక్కిన ఫ్రూడెన్షియల్ భాదితులు

>> Thursday, November 09, 2006



ఫ్రూడెన్షియల్ అనే బ్యాంకు ఉందని మీకు గుర్తుందా? ....ఆ...అదే బోర్డు తిప్పేసిన బ్యాంకు...రాజీవ్ రెడ్డి అనే గొప్ప వ్యక్తికి, ఇంకా చాలా మందికి..డిపాజిటర్ల డిపాజిట్లను అప్పనంగా అప్పిచిన ఒక సంస్థ.

పాపం ఈ డిపాజిటర్లంతా, లిక్విడేటర్ వద్ద ఉన్న 140 కోట్లను చెల్లించాలని కోరుతూ రోడ్డెక్కారు ...కొంతసేపు సామూహిక నిరాహారదీక్ష చేసి..ఒక అల్టిమేట్టం ఇచ్చి వెళ్ళారు.

సరే...డబ్బు బ్యాంకులో దాచి ఆదా చేద్దామనుకున్న పిచ్చి వాళ్ళూ, ఆమాయకుల పరిస్థితి ఇలాఉంటే...మరి అప్పుతీసుకున్న వాళ్ళ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ఋణగ్రస్తులలో ముఖ్యులు అయిన 'అమృతా కాసిల్' (హోటల్, సెక్రేట్రేట్ ముందు ఉంటుంది...దీని పరిస్థితి అగమ్యగోచరం..), రాజీవ్ రెడ్డి (అబ్బో ఈయన గురించి చెప్పడం చాలా కష్టం...ఏ రోడ్డు మీద చూసినా ఈయనే).



ఈ రెడ్డిగారు మొన్న బెంగళూరు లో ఒక వ్యాయమశాల (Gym) ప్రారంభించి ప్రముఖులను ఆహ్వానించారు.. రెండు రోజులకొకసారి విదేశీయానం, అక్కడ ఫొటోలు తీయించుకొని ఇక్కద మా క్లబ్బు లో చేరండి అని హోర్డింగులతో ఒకటే పోరు...


దీని వలన నాకు తెలిసిన విషయం :





ఆప్పు చేయ్యండి. తీర్చవలసిన అవసరం లేదు...




అప్పిచినవాడే రోడ్డున పడాతాడు..మనము కులాసాగా విదేశాలు తిరగ వచ్చు.





ఇప్పటికైన ఖాతాదారులు నిరాహారదీక్షలు మనుకొని డబ్బు రాబట్టుకొనే ప్రయత్నము చేయండి...





నా సూచన: ఒక్కసారి లగే రహో మున్నాబాయి లోని ప్రయత్నము చేద్దామా?
కానీ ఇక్కడ బొకేలు పంపించనవసరము లేదు...ప్రతి ఒక్కరూ వారి వారి బ్లాగులలో రాజీవ్ రెడ్డి లాంటి వారు కోరుకోవాలని ఒకే రోజు రాసి పెట్టండి...దాదాపు అవి ఓక 100 దాక చేరుకుంటాయి.. అప్పుడు ఏదో ఒక పేపర్ వాదికి అవి చూపించితే ఇంకా పబ్లిసిటి వస్తుంది...





ఆలోచించండి...

Read more...

తెలుగు పలుకు

>> Wednesday, November 01, 2006

పల్లవి:

తెలుగువాడా తెలుగు మాట తెలియదని అనకు
తేనెలొలుకు తెలుగు పలుకు తనివితీరా పలుకు
తెలుగు మాట చెరుకు ఊట తెలుగుతనము తేట
తెలుగు పలికి తెలుగు వెలుగు చిలుకు ప్రతీపూట

చరణం:

అందమైన అక్షరాలు యాభైఆరు
అన్నిట్లో అందాలు జాలువారు
మీటితే రాగాలు పొంగిపారు
పలికితే భావాలు వేలవేలు
గోదారి గలగలతో క్రిష్ణమ్మ గమకముతో
శృతికలిపి లయపలికే వీనులవిందు మన తెలుగు

చరణం:

నన్నయ తిక్కన వేమనాదులు రంగరించి కలిపిన పాయసమిదియె
చదువులమ్మ చల్లనైన చేతులతోటిఅభయమొసగి పోసిన అమృతమిదియె
మన జాతికి మూలం, మన గుండెల నాదం
తెలుగుభాష కలకాలం నినదించే వేదం

వ్రాసిన వారు శ్రీ సిరాశ్రీ గారు, గ్రేట్ అంధ్రా నందు.
వారికి మీ అభినందనలు తెలియచేయాలంటే ఇక్కడ మీటండి.

Read more...

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

హమ్మయ్యా!

అందరూ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు..
తెలుగు దేశం (ఆంధ్ర) లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బడులు అన్నిటికీ శెలవ ఇవ్వడముతో ఒకటే సందడిగా ఉండి ఉంటుంది..కదా..

జోతి గారు ఆంగ్లములో శుభాకాంక్షలు చెప్పేటప్పటికి, నవీన్ గారికి భాషాభిమానము, రాష్ట్రాభిమానము పొంగుకొచ్చాయి..

జాబిలిముని గారు, జ్యోతిగారికి కొండంత అండగా నిలచారు...

ఇదేనేమో తాడేపల్లి గారు చెప్పిన అనుభంధం...సమైక్య ఆంధ్ర.బాగుంది..

నేను 2 సం క్రింద 'రచ్చబండ్' లో ఒక ప్రశ్న అడిగాను., నాకు జవాబు రాలేదు...ఇప్పటికీ జావాబు దొరకలేదు (సరీగా వెతకలేదేమో)...మీకు ఎవరికైన తెలిస్తే చెబుతారా?

మన రాష్ట్రానికి జెండా ఉందా? ఉంటే దాని రంగు, రూపము తెలుపండి..

Read more...

కొన్ని మంచి పత్రికలు

>> Tuesday, October 31, 2006

కొన్ని మంచి పత్రికలు

మనందరికీ ఈ వల (అంటే internet) లో కధలు, కవితలు చదవడం అలవాటు. మీ అందరికీ కొన్ని మంచి పత్రికలను పరిచయం చెద్దమనుకొంటున్నాను. వీటి గురించి ఎవరికైన తెలుసుంటె...మంచిదే...తెలియని వారికోసం ఈ పరిచయం..
1.)

రచన
సంపాదకుడు: శాయి
వెల: 35 రూ / 10$
ప్రచురణ: హైదరాబాదు
నాణ్యత : బాగుండదు

ఈ పత్రిక ప్రవాసాంధ్రులలో చాల పేరు పొందినది. ఈ పత్రిక ముఖ్యంగా ప్రవాసాంధ్రుల కొరకు నడుపబడుతున్న పత్రిక అని నా అభిప్రాయము.. దీనిలో సాహిత్యానికే పెద్ద పీట. ప్రవాసాంధ్రుల కధలు, కవితలు, సమీక్షలు, విశ్లేషణలు ఎక్కువ...

ఇది మాసపత్రిక - కానీ మాసం మాసం రావడం అనుమానమే..(దీనికి చాలా కారణాలు ఉన్నాయంటారు)

2.

పత్రిక

గౌరవ సంపాదకుడు: శ్రీ రమణ (వీరి గురించి పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు)
వెల: 5 రూ / 10 రూ (ప్రత్యేక సంచిక)
ప్రచురణ: మౌనిక పబ్లికేషన్స్ - హైదరాబాదు
నాణ్యత : బాగుంది

ఈ పత్రిక కూడా సాహిత్య భరితమైనది. ముఖ్యముగా సంపాదకీయం "xxxx - మానవ సంబంధాలు" అదిరిపోతుంది..దీనిలో నానీలు బాగుంటాయి (అర్ధం అయితె), వ్రాసినవారే మళ్ళా వ్రాస్తారు..కొత్తవారికి అవకాసం ఎక్కువ ఇచ్చినట్లు కనపడదు.

కధలు, కవితలు, కాకరకాయలు ఎక్కువ.

ఇది మాస పత్రికో పక్ష పత్రికో గుర్తు లేదు.

3.

రసమయి
సంపాదకుదు : నండూరి పార్ధసారధి
వెల:35 రూ (30 రూ లకు తగ్గించారని చదివినట్లు గుర్తు)
ప్రచురణ : హైదరాబాదు
నాణ్యత : అదిరిపోతుంది

కధలు కాకరకాయలు లేవు. ఇది మాత్రం ప్రతి ఇంటా ఉండవలసిన పత్రిక, మొన్నటి వరకూ భారత భాగవతాల నుంచి కృష్ణుడి గురించి 'క్రిష్ణ సంచికలు (మొత్తం 25 దాకా) ప్రచురించారు...అదుర్స్, ఇంక భానుమతి గురించి, సంగీతం గురించి, అన్నమయ్య రచించిన ప్రజలకు తెలియని పద్యాల గురించి, ఎందుకులే ఒకటా రెండా ....
తప్పకుండా తెప్పించుకోండే...ఈ మాస పత్రికని

చివరిగా
4.

చినుకు
సంపాదకుడు : నండూరి ****
వెల: 10రూ
ప్రచురణ: విజయవాడ
నాణ్యత : ఫరవాలేదు.

కధలు, మినీ కవితలు, కార్టూన్లు దీనిలో వస్తువులు. అదృష్ట దీపక్, నగ్నముని, ఇంకెందరో ఇందులో కనిపిస్తారు.
కొత్తవారికి అవకాశాలు ఇస్తారు.

పైన చెప్పిన పత్రికలు బయట దొరకవు...చందాదారులు కావటమే మార్గం.
100 కి 100 శాతం ఇవి మంచి పత్రికలు అని మరొక సారి నొక్కి వక్కాణిస్తున్నాను.

Read more...

సవతి

>> Wednesday, October 18, 2006

దేశానికి భారతమాత ఒక్కరే ఉంటారు, తెలుగుతల్లి అంటే ప్రత్యేక దేశం కోసం ప్రయత్నాలు చేస్తున్న కిందకే వస్తుంది - వి. ప్రకాశ్. (TRS ముఖ్య కార్యదర్శి)

అబ్బో అబ్బో ఏమి తెలివో.. ఇంతటి తెలివి వంతులను నాజీవితం లో ఎపుడూ చూడలేదు.

తెలుగుతల్లి విగ్రహం పెట్టడం అహంకారానికి నిదర్శనం.

అబ్బో ఏమి చెప్పారండి, మరి తెలంగాణా తల్లి, తెలంగాణా భవనం.. ఇవేమిటి?

తెలంగాణాతల్లి అంటె తెలంగాణా భూమి పుత్రులుగా మేము ఆవిధంగా అంటున్నాము...

నీ తెలివి తెల్లారా...తెలుగు భూమి, తమిళ భూమి, తెలంగాణ భూమి అంటు వేరే ఉందవని, భాషను బట్టి ప్రాంతాలు ఏర్పడ్డాయనీ నీ కు ఎప్పుడు తెలుస్తుంది?


తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాల ప్రజల జాతి ఒకటికాదు, ఒకే జాతి అంటే భాషతో పాటు సంస్కృతి, ఆచారవ్యవహారాలు, సాంఘీక జీవనవిధానం ఒకే విధంగా ఉండాలి.

నీ బొం...తెలంగాణాము అంటే తెలుగులో గానము..ఒక అద్భుతమైన పాట. తెలుగు అంటె నెల్లూరు, తిరుపతి, కడప, విజయవాడలలో మాట్లాడేది మాత్రమే కాదు...చెన్నపట్టణపు సరిహద్దుల మొదలు కన్నడిగుల చెవులను తాకుతూ, విజయనగరపు రాజధాని "హంపీ" లోని రాతి కట్టడాల ను తాకుతూ, గోల్కొండ లో గోలచేస్తూ, భద్రద్రి లోని రాములవారి పాదాలు తాకుతూ, ప్రకాశం బారేజీ మీద నిలుచొని క్రిష్ణమ్మ తో పరాచకాలాడుతూ, నన్ను తాకగలవా అని విశాఖపట్టణం లో సముద్రుదితో ఆడుకొంటూ, జగ్గన్నాధుని చేవులకు చెరేదే ఈ గానం. అదే తెలంగాణం.

నువ్వు మాట్లాదేది తెలుగు, రాసేది తెలుగు, తిట్టేదీ తెలుగు, నీ తెలుగు లో ఉండేది కేవలము యాస అని, దీని మూలాధారం తెలుగని తెలుసుకో.

పత్రికలవాళ్ళతో, మీడియా వారితో మాట్లాడుతున్నప్పుడు కొంచెము ఆచితూచి మాట్లాడడము చెయ్యి, నీ రాజకీయ భవిష్యత్తుకు అది చాలా అవసరము.

Read more...

విజయోత్సవాలు!

>> Friday, October 13, 2006


కొద్ది కాలం క్రిందట దోమల రాజ్యం లో "మహానాడు" జరిగింది.

కుర్ర దోమలు, ముసలి(పెద్ద)దోమలపై విరుచుకుపడ్డాయి -"ఇంతకాలం TRS కాంగ్రెస్సు తో కలసి ఉన్నట్లుగా, మీరు ఆ మనుష్యులతో కలసి ఉన్నారే, ఎప్పుడైనా ఆ మనుష్యులు మిమ్మల్ను పట్టించుకున్నారా?, ఎప్పుడూ చంద్రశేఖర రావుని చూసినట్లు (పురుగుని చూసినట్లు) చూసేవారుకాదా?, మిమ్మలని వాళ్ళ మీడియ ఎప్పుడైన మొదటి పేజీ లో కవర్ చేసిందా?- అని.

ఓ పెద్ద దోమ నచ్చచెప్పబోయింది..చూడు మనుష్యులన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి., వాళ్ళలో వాళ్ళకే అనేక సమస్యలు.. సాగునీటి కుంభకోణానికి విలువ ఇవ్వాలంటాడు ఒక సబ్ ఎడిటరు..,కాదు తాగునీటి కుభకోణానికి అంటాడు మరొకడు.. పోనీ ఎడిటర్ గారు తెగించి ఎదో ఒకటి పెట్టేద్దామంటె పైన సూపర్ ఎడిటర్ Y.S గారి చివాట్లు తప్పవు. ఏ ఫాంట్ లో వేయాలో, ఎక్కడ వేయాలో ఆయనగారి చేత పాటలు తప్పవు..ఈ సంబరంలో, మన మీద వార్త వ్రాయడమే అబ్బురం., పైగా హెడ్‌లైన్స్ లో కావాలనుకోవడం మరీ విడ్డురం.

ఏం? ప్రాజెక్టుల గురించి, హౌసింగ్ స్కాముల గురించి, కాందీశీకుల భూమి గురించి, తెలుగు బాషా పరపతి గురించి, రింగురోడ్ల గురించి., ఇలా అన్నిటి గురించీ వ్రాస్తున్నారుగా..మన గురించి వ్రాయడానికేమైంది? - అని సణిగిందో యువత.

"అవన్నీ సాధారణ ప్రజలను ఆర్ధికంగా బాధించి, నష్టపెట్టేవి., అందుకని వాటి గురించి పట్టించుకుంటారు."..పెద్దరింకంతో నచ్చ చెప్పబోయిందో ముదుసలి.

"ఓహొ! మనం మాత్రం కోన్‌కిస్కా గాళ్ళమా?, మన వలన హెల్త్ పోతుంది కదా..'హెల్త్ ఈజ్ వెల్త్' కాబట్టి వాళ్ళకి వెల్త్ కూడా పోయినట్లే"...అంది ఇంగ్లీషు మీడియం లో చదువుకోని., బ్రిటీషు లైబ్రరీ లో సభ్యత్వము తీసుకొన్న ఒక BPO దోమ.

ఈ భాగ్యానికే ఇంగ్లీషు కొటేషన్ ఎందుకు..."ఆరోగ్యమే మాహా భాగ్యం" అనొచ్చుగా అందో ప్రభుత్వ గ్రంధాలయములో స్థిర నివాసము ఏర్పరచుకొన్న లావుపాటి దోమ..(తెలుగు పుస్తకాల జోలికి వెళ్ళేవారు లేకపోవడము వలన పుస్తకామీద ఉన్న దుమ్మును కూడా దులపక నిద్రపోతున్నాడు లైబ్రేరియన్, అందువలన బద్దకించి దోమలు కూడా అక్కడనే నివాసము ఏర్పరచుకొని ఎగరడము కూడా మర్చిపోయాయి).

"ఆ మన వలన మనుషులకు పోయె ఆరోగ్యం ఎంతలే.. ఐనా మన రాతను, భారత దేశాన్ని ఎవడూ బాగు చేయలేడు"..అందో విదేశాలకు వెళ్ళోచ్చిన ప్రవాస దోమ.

అయినా ఈ మస్కిటో కాయిల్సు, ఆలౌట్లు వెలిగించి మనమంటే ఖాతరు లేకుండా ఉన్నారు, సన్నాసి ఎదవులు అని అరిచాడు నరేంద్ర ని కుట్టొచిన దోమగాడు.

ఆ రోజులే వేరు, మనకోసం దోమతెరలు కుట్టించేవారు, దాని కోసం రాతాలు, పందిరి మంచాలు తయారు చేయించేవారు..ఇప్పుడేముంది?., చిన్న స్విచ్ వేస్తే చాలు సన్నని పొగ రావటం, దెబ్బకి దోమలు చచ్చినట్లు టీవి లొ యాడ్స్ - అంతా పోయేకాలం అని గొణిగింది, గాంధీ కాలంనాటి దోమ.

"ఠాఠ్! నేనొప్పుకోను" అని అరిచిందో యువ దోమ. " ఇలా ఐతే మన పరువేమి గాను? మనల్ని ఉత్తి అల్పప్రాణులనుకోరూ?"

"అల్పప్రాణివి కాకపోతె పెద్ద..పులివా? లేక బలా సాహెబ్వి అని అనుకుంటున్నావా? మనల్ని చీమా, దోమా అని తీసిపారేస్తారు. ప్రాస కుదిరిందనే కాదు, ఆకారంలో ఇంచుమించు ఒకటే అనికాదు, చీమకాటుకి ఎంత విలువో దోమకాటుకి అంతే విలువ అని తాత్పర్యం!" బోధపరిచంది అధ్యక్ష స్థానములో ఉన్న ముసలిదోమ.

"కామ్రేడ్స్! చీమకాటుకి, దోమకాటుకీ ఉన్న తేడా చాటిచెబుదాం, ఎప్పటికైనా దోమలంటె మనుష్యులు భయపడేట్లు చేద్దాం, పోరాడితే పోయేదేమీలేదు ఈ అల్పప్రాణులనే పేరు తప్ప.." అని ముక్తకంఠం తో అరిచాయి విరసం, సరసం, నీరసం ( ఇవి కమ్యూనిస్టు గుంపులు) సభ్యులైన యువ దోమలు.

దీనితో హెడ్‌లైన్స్‌కెక్కుతారని భ్రమ పడుతున్నారా?., ప్రశ్నిచిందో పండు దోమ.

"బద్‌నాం భీతొ నాం హై" అన్నారు మీలాంటి పెద్దలే! ఈనాటి పేపర్లో హెడ్‌లైన్స్ ఏమిటి? యాక్సిడెంట్లు, అవినీతి చర్యలు - ఇవేగా! రాష్ట్రపతి ప్రసంగమైనా క్రింద వేయడమే! ఇక నోబుల్ ప్రైజ్ న్యూసైతే ఎక్కడో లోపలి పేజీలలో వేస్తున్నారు! మనము హెడ్‌లైన్స్ కెక్కాలంటే ఎదో వెధవ పని చేయాలంతే! నేటి నుండి మా సమరం ప్రారంభం!" అన్నాడు మంచి ఊపు మీద ఉన్న ఒక కుర్రదోమ, అంతే అంతలో మంచి కత్తిని, ఒక రంగు రంగుల తలపాగానీ బహూకరించి 'జై' అన్నాయి మిగిలిన కుర్రదోమలు.

ఇక అప్పటినుండి దోమలసేన ఘటోత్కచుడి సేనలా ద్విగుణం, బహుళం ఇంది. శాంతి చర్చల తరువాత మావోయిస్టుల్లా అనేకమంది కొత్తవాళ్ళను రిక్రూట్ చేసుకొన్నాయి. ముక్కుతో రాకెట్‌లాంచర్లా నేరుగా ఎలా ఎటాక్ చేయాలో నేపాల్ వాళ్ళ సహాయంతో వాళ్ళకు బాగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మునిసిపాలిటి వారికి లంచాలించి మురుగ్గుంటలు యిబ్బడిముబ్బడిగా పెరిగేట్లు చూసారు.

ఇక చూస్కొండి, ఎక్కడ చూసినా దోమలే! బోల్డు బోల్డు జ్వరాలు, మోకాళ్ళ నొప్పులు, హై టెంపరేచర్లు. ఈసారి జరిగిన సమావేశంలో కుర్రదోమలు బోర విరుచుకున్నాయి - "చూశారా, మా ప్రతాపం. అందరూ మమ్మల్ని తలుచుకొనేవారె!" అని.

పెద్ద దోమలు పగలబడి నవ్వాయి - ఏడిసినట్లు ఉంది. కష్టమంతా మనది, పేరు ఇం'కోళ్ళ్'ది. ఆ కీళ్ళనొప్పుల వ్యాధికి చికెన్‌గున్యా అని పేరు పెట్టారు. చికెన్ వల్లనే వస్తోందనుకొని కోళ్ళు తినడం మానేశారు. మన ప్రజ్ఞేం తెలిసింది? మనుష్యులకు కోళ్ళంటే భయం పట్టుకొంది కానీ మనమంటే కాదు అని ఎద్దేవా చేశాయి.

"పోనీ ఎదో విధంగా ప్రతిపక్షాలు అల్లరి చేయడానికి అవకాశం ఇచ్చాంగా" అని సమర్ధించుకోబోయాయి కుర్రదోమలు.

"అదంతా వాళ్ళ కుట్ర! రోగాలు లేవు, ఏమీలేవు, అదంతా 'మిత్' అని కొట్టిపారేశాడు ఆరోగ్యమత్రి" అంది చిరాగ్గా BPO దోమ.

"మిత్ అనే బదులు దానికి దగ్గరగా ఉన్న మిధ్య అనే పదం వాడవచ్చుగా" అంది తెలుగు సంఘాలవాళ్ళను కుట్టిన దోమ కోపంగా.(ముఖ్యంగా అనిల్ చీమలమఱ్ఱి ని)(ఇదే దోమ, గ్రంధాలయం లోని దోమ అని గ్రహించగలరు).

"మాయంటావూ, మిధ్యంటావూ" అంటూ శ్రీశ్రీ గేయం ఆలపిస్తూ ఓకుర్రదోమ సమావేశం అవుతుండగానే సరాసరి ఆరోగ్యమంత్రి ఇంటిమీదకి దాడికెళ్ళింది.

కానీ ఆయన ఓపట్టన చలించే ఘటం కాదు. 'నేను డాక్టర్ని కాను, మాఇంట్లో జ్వరం ఎందుకొచ్చిందో తెలియదు. కానీ దీనికి కారణం అపరిశుభ్ర పరిసరాలనీ, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అనడం, ప్రతిపక్షాల బాధ్యతా రాహిత్యం మాత్రమే!, ఇది ప్రతిపక్షాల కుట్ర." అని వాదించాడు.

దోమల వలన జనాలు ఛస్తున్నారని వీళ్లనడం, కాదని ప్రభుత్వం వారు వాదించడం, దానాదీనా దోమలకు రావలసినంత ఖ్యాతి రాకపోవడం జరిగింది.

కుర్రదోమలు విడిగా సమావేశమయ్యాయి. కొడితే ఏనుగు కుంభస్ధలాన్నే కొట్టాలన్న నిర్ణయం జరిగింది. వేస్తే గీస్తే చంద్రశేఖరరావులా ఢిల్లీలోనే పాగా వేయాలని నిశ్చయించారు. ఇరవై మది సభులతో ఆత్మాహుతి దళం ఏర్పాటయింది. హై సెక్యూరిటీ ఉన్న ప్రధనమంత్రి ఇంటిపైననే దాడికి వెళ్ళాలని నిశ్చయించాయి పాలిట్‌బ్యూరో. భగత్‌సింగ్ ఏకంగా పార్లమెంటులో బాంబులు వేయడం చేతనే అందరి దృష్టినీ కర్షించాడనీ, అల్లూరి సీతారామరాజు మద్రాసు అసెంబ్లీ మీద బాణాలేయకపోవడం వల్లనే సరైన ఫోటో కుడా లేకుండా చరిత్రలో మరుగున పడ్డాడని దృష్టాంతాలు వల్లేవేయడం జరిగింది.

ఆత్మాహుతి దళం కదిలింది. ప్రధాని మనుమలు రోగాన పడ్డారు. డెంగ్యూ వ్యాధి అనేది ఉందని, దానివలన ప్రజలు మరణించే ప్రమాదం ఉందని ఎట్టకేలకు అధికారికంగ ప్రభుత్వం ఒప్పుకుంది. దోమల గురించి అన్ని పత్రికలూ మెయిన్ బ్యానర్ హెడ్‌లైన్స్ ఇచ్చాయ్.

దోమల రాజ్యం లో ప్రస్తుతం విజయోత్సవాలు జరుగుతున్నాయి.

ఈ కధని శ్రీ మొక్కపాటి గారు, గ్రేట్ఆంద్రా.కాం నందు వ్రాస్తే నేను కొంచెము మార్పులు చేసి, నా పద్దతి లో అందిస్తున్నాను..మొక్కపాటి గారికి జాబు వ్రాయాలంటే ఇక్కడ నొక్కండి.

Read more...

రామా కనవేమిరా..! శ్రీ రఘురామ కనవేమిరా?

>> Thursday, October 12, 2006





రామా కనవేమిరా..! శ్రీ రఘురామ కనవేమిరా?

ఇదేమిటీ ఈ పాట వ్రాసాడు అని అనుకొంటున్నారా?....కాదండీ చదవండి..మీకే తెలుస్తుంది.

కడప జిల్లా "ఒంటిమిట్ట" లో శ్రీ కోదండరామస్వామివారు కొలువై ఉన్నారు...ఒంటిమిట్టకు ఉన్న విశేషాలు ఏమిటంటే:

ఈ గుడిని చోళులు, విజయనగర రాజులు కట్టించారు.

ఈ గుడిలో, కేవలము సీత, రామ మరియు లక్ష్మణులు మాత్రమే దర్శనమిస్తారు. హనుమానులు గారు లేరు...

ఈ మూడు విగ్రహాలు కలసి ఒకే రాతి పై చెక్కబడ్డాయి.

32 స్తంభాలతో నిర్మించిన "మధ్యరాగమడపం" అతిసుందరమైనది...

దీనిని చూసి ఒక ఫ్రెంచ్ యాత్రికుడు, Tavernier, "one of the grandest pagodas in the whole India". అని అన్నారని ఒక సమాచారము.

ఇవేకాక,

శ్రీ మధ్భాగవతం వ్యాసకర్త "శ్రీ బెమ్మర పోతనామాత్యులు" ఇక్కడివారే..


మాకు తెలుసు ఈ సోది ఆపు అంటారా?...సరె..అసలుది క్రిందుంది చదవండి.

ఆ మండపము మధ్యలో రాతితో చేసిన పుష్పం, దాని మధ్యలో ఒక రాతి మొగ్గ అమర్చారు..ఆ మొగ్గలో వజ్రాలు పెట్టి ఉంటాయని కొందరి అనుమానము / అపోహ /ఊహ .

పురాతన దేవాలయాల్లో విగ్రహాల క్రింద నవధాన్యాలు, వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలు ఉంచి ప్రతిష్ట చేస్తారని నమ్మకము.

ఆ రాతిమొగ్గ చోరీ అయ్యిందని సమాచారము., ఈ దొంగతనము జరిగిన రాత్రి, వాచ్‌మెన్ను ఇంటికి పంపి దేవాదాయ శాఖాధికారి, పురావస్తు శాఖాధికారి, మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గుడిలో మద్యం సేవించినట్లు వినికిడి.

గుడిలో మద్య సేవనం, ఆపై దొంగతనం....రామరామా...

ఓ రామా ఇకనైనా నిద్రలే...ఎమా మొద్దునిద్ర...

Read more...

Point Of View

>> Monday, October 09, 2006

British Diplomat paid a courtesy visit to Lalloojee.

During a Garden party at the Palace, he thought of entertaining Lalloojee with the following magic of numbers.

He said, "Your excellency,

Look at the value of the alphabet:

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26


Now, look at this Sir, if we calculate together it will be:

H A R D W O R K
8 1 18 4 23 15 18 11 = 98 % Only

K N O W L E D G E
11 14 15 23 12 5 4 7 5 = 96 % Only

L O B B Y I N G
12 15 2 2 25 9 14 7 = 86 % Only

L U C K
12 21 3 11 = 47 % Only

Sir, you should look at the final one, which is most important.

A T T I T U D E
1 20 20 9 20 21 4 5 = 100 %

Sir, do you find it useful?

This magic can work on your people to improve themselves, increase productivity, and make your Kingdom prosperous.

Sir, I can arrange to send our experts to coach your people. We can do it in less than a year"

Lalloojee thought for a while; and said,

"I have better formula. See this......

C O R R U P T I O N
3 15 18 21 16 9 15 14 = 111 %

Do you want me to come and teach your people? I can do it in less than one week."

Read more...

క్షమాభిక్ష

>> Thursday, October 05, 2006

ఇండియన్ పీనల్ కోడ్ (IPC) 302, భారత శిక్షా స్మృతిలో అతి పెద్ద శిక్ష - "ఉరి శిక్ష"

ఉరిశిక్ష ఎవరికి వేస్తారు...కరడు కట్టిన తీవ్రవాదులకు, పాశవికంగా హత్యలు చేసేవారికి.

మరి ఉరిశిక్ష పడిన వ్యక్తులకి మానవతా దృక్పధం తో మన ప్రభుత్వం కొంతకాలంగా క్షమాభిక్షను ప్రసాదించి "యావజ్జీవితం కారాగారం" లోనే ఉండే అవకాశాలను కల్పించింది...ఉదా: నళిని భాగ్యనాధన్, రాజీవ్ గాంధీ ని చంపిన వ్యక్తులో ఒకరు.

అయితే భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైన పార్లమెంటు భవనము పై దాడి కేసులో, మరణ శిక్ష ఖరారైన నిందుతుడు అఫ్జల్ గురు క్షమాభిక్ష కొరకు చాలమంది ప్రముఖులు ప్రయత్నిస్తున్నారిప్పుడు. కరడు కట్టిన తీవ్రవాదిగా ముద్రపడ్డ అఫ్జల్ కు మద్దతుగా శ్రీనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, నిజంగా మనము చేసుకొన్న పాపం, సిగ్గుపడాల్సిన విషయం, తలదించుకోవలసిన సమయం.

మానవ హక్కుల గురించి మాట్లాడే మానవహక్కుల సంఘం (మామూలుగా, వీరి దృష్టి లో మనవులంటే నక్సలైట్లు, తీవ్రవాదులు మాత్రమే..) అఫ్జల్ గురు కి క్షమాభిక్ష ప్రసాదించి, మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మర్చేలా రాష్ట్రపతిని కోరుతూ ఢిల్లీ లో ప్రదర్శనలు మొదలు పెట్టింది...దీనికి మద్దతు గా ప్రముఖ రచయిత్రి అరుందతీ రాయ్ ధర్నా నిర్వహించింది...(అసలు వీళ్ళే ఆ దాడి లో ముఖ్యులు అని నా అభిప్రాయం)


భారతీయుడి ఆత్మగౌరవనికి ప్రతీకైన పార్లమెంటు పై దాడి చేసిన వ్యక్తులకు క్షమాభిక్ష ప్రసాదించమని అడగడం, ప్రసాదించడం ఎంతవరకూ సమంజసం?


ఇది ఎంతమాత్రమూ ఆహ్వానించదగిన పరిణామము కాదు. ఈ కేసులో క్షమాభిక్ష ప్రసాదిస్తే త్వరలోనే రాబోతున్న, గుజరాత్ లోని అక్షరధాం కేసు, ముంబై ప్రేలుడుల కేసు, మొన్న జరిగిన ముంబై రైలు బాంబుల కేసు లలో కూడా ఇదే జరుగుతుంది..దేశమంతటా విద్రోహుల అరాచకాలు హెచ్చుమీరి పోతాయి..

చివరిగా నాది చిన్న అనుమానము:

గద్దర్ను, వరావర రావును పోలీసులు ఎత్తుకెళ్ళినప్పుడూ, మొన్న పుట్టపర్తి గారి విగ్రహం పగలగొట్టినప్పుడు..పెట్టిన పిటీషన్లు అరుంధతీ రాయ్ మీద, మానవ హక్కుల సంఘం మీద ఎందుకు పెట్టారు?

మనకి ఆత్మాభిమానము, ఆత్మగౌరవము లేవా? రాజ్యాగము మీద గౌరవము లేదా?...

పైన చెప్పినవి మీకు లేకపోతే "భారతీయులం" అని చెప్పుకో వద్దు దయచేసి...

ఉంటే, మీరే పిటీషన్ పెట్టండి...అందరి సంతకాలు అడగండి. మీవద్దకు పిటీషన్ వస్తే సంతకం పెట్టండి.

Read more...

పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?

>> Saturday, September 30, 2006

ఈ వ్యాసం ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు...ముఖ్యంగా విహారి గారి ఉత్తరాలు చదివి నా అభిప్రాయం చెబుతున్నాను అంతే.


పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?

ఏవరో ఎందుకు కట్టాలి?., మీరు, నేను చాలమా?

ఈ సాలెగూడులో ఎన్నో అద్దెగృహాలు, సొంతిల్లు, వ్రాత పత్రులు (నేను బ్లాగులను ఇలా పిలుస్తాను..మామూలుగా) ఉన్నాయి, దానికి తోడు ఎన్నో సంఘాలు ( ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే గుంపులు) ఉన్నాయి., ఎవరికి వారు దేశం తగలబడి పోతుందని, తెలుగు మృతభాష అవుతుందని గొతుచించుకు చెబుతారు., సంతోషం...నిజానికి వాళ్ళు అరవడం వరకే పరిమితం.

కొందరు కనీసం తెలుగు అభివృద్ధి కొరకు కొన్ని క్రొత్త ప్రయోగాలు చేసి ఈ గణితేంద్రము (కంప్యూటర్ కు వచ్చిన తిప్పలు) లో కొన్ని మార్పులు చేసినారు...వారికి నా ధన్యవాదములు.

ఇది ఇంతవరకే., మిగిలిన కాలములో వారు వారికి నచ్చిన/వీలైన భాషనే ఉపయోగిస్తారు.. దీనిని కాదనే అధికారం మనకు లేదు.

ఈ మధ్య కాలములో వచ్చిన చలన చిత్రములు (సినిమలు) రంగ్ దె బసంతి, లగే రహో మున్నాభాయి లను దాదాపు అందరూ చూసిఉంటారు, అందరికీ నచ్చి వుంటాయి., ఎందుకంటే అందరం విధ్యావంతులం కదా...కానీ ఇందులో చెప్పిన ఒక్క విషయం మనము మర్చి పోయాము...అదేఅంటే

"మార్పు అనేది ఎక్కడినుంచో రాదు...మనదగ్గర్నుండే మొదలవుతుంది".

వాళ్ళు తెలుగులో వ్రాసారా, ఇంకోకరకంగా వ్రాసారా వద్దు....మీరు మొదలు పెట్టండి. ప్రతీ దానికీ తెలుగులోనే జవాబు వ్రాయండి., (వీలైతే మీ కార్యాలయ విషయాలలో కూడా..మమూలుగా ఐతే ఇది కుదరదు..) నేను ఇప్పుడు ఇదే అనుచరిస్తున్నాను...

ఈ మార్గములో మీతో పాటు నడిచే నాలాంటి బాటసారులు చాలామందే ఉండి ఉంటారులేండి...

Read more...

మంచి నాయకులు కావాలేం?

>> Thursday, September 28, 2006

అది కరీంనగర్ నియోజకవర్గంలో ఒక గ్రామం. రచ్చబండ దగ్గర ఓ విద్యార్ధి నాయకుడు ఉపన్యాసం దంచేస్తున్నాడు -

'ఇప్పుడీ ఉపయెన్నిక యెవరికోసం? ఈ ముసలాయన "ఛాలెంజ్" చేసాడట..ఇంకోఆయన రెచ్చగొట్టాడట. ఇప్పుడున్నాయన "ఇజ్జత్ కా సవాల్ " అనుకొని రాజీనామా చేసాడట., సరే!., ఇవతల రాజీనామా చేసినాయన ఎలక్షన్లొ నిలబడతాడో లేదో చెప్పటం లేదు, ఇవతల "ఛాలెంజ్" చేసిన ముసలాయనా కండిడేట్ కాదు. సైన్యాన్ని ఇబ్బంది పెట్టకుండా ద్వందయుద్ధం చేద్దామన్న పెద్దాయన మాట గాలికి ఎగిరిపోయింది. ఇక ఎవరి గురించి ఎన్నిక పెట్టినట్లు? ఎవడబ్బ సొమ్ము ఖర్చు పెడుతున్నట్లు?

"...తెలంగాణా సెంటిమెంటు మీద రెఫరెండం అంటున్నాడు గదయ్యా?.."...అడ్డు తగిలారు ఎవరో.

'...తెలంగాణా మీద రెఫరెండం పెట్టాలంటే., రాష్ట్రం అంతా పెట్టాలి., అనేక విషయాలు తేల్చుకొని ఒక ప్రతిపాదన ముందు పెట్టి మీ అభిప్రాయం చెప్పండి అని అడగాలి. అంతే గానీ ఈఒక్క నియోజక వర్గం లో ఒట్ల బట్టి 294 అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలు ఏమనుకొంటున్నారో తేలిపోతుందా? ఎన్నిక ఫలితం అనేక అంశాలపైన అధరపడి ఉంటుంది. సిట్టింగ్ ఎం.పి ఏమిచేశాడు?.., రాబోయేవాడు ఏమి చేస్తాడు? ఇల అనేక పాయింట్లు వుంటాయి. అందువలన ఇది రెఫరెండమే కాదు.. అసలు నేనడిగేది - ఇప్పుడి ఎలక్షన్లు ఎందుకని?., అందువలన మంచి నాయకులు దొరికేదాకా మనమందరమూ ఎన్నికలను బహిష్కరించాలి - అని పిలుపునిస్తున్నాను. ఇది మనల్ని అడిగి పెట్టిన ఎన్నిక కాదు..'

విద్యార్ధి నాయకుడి ఉపన్యాసం విని అందరూ చప్పట్లు కొట్టారు. 'అంతే..అంతే ఎన్నికల బహిష్కారమే...' అంటూ అరిచారు. కానీ చెట్టునీడన కూర్చొన్న పెద్దాయనలో మాత్రం చలనం లేదు. చుట్ట కాల్చుకొంటూ కూర్చున్నాడు. విద్యార్ధి నాయకుడు ఆయనకేసి తిరిగి 'ఏం పెద్దాయనా! నువ్వేమీ పలక్కుడా వున్నావు? నువ్వెళ్ళి ఓటేస్తావా ఏంది?' అన్నాడు.

ఆయన చుట్ట పడేసి, ఎమర్రా!, అయితే మీరందరూ ఓట్లేయరన్నమాట...అడిగాడు జనం కేసి తిరిగి.

అంతేగదా పెద్దాయనా..! వాళ్ళు మనల్ని అడిగి పెట్టారా ఈ ఎలక్షను? అన్నాడు శ్రోతల్లో ఒకడు.

ఒరే! నేను పెద్ద చదువుకున్నోణ్ని కాను, కానీ తెలియక అదుగుతాను., జవాబు చెబుతావా? అని మొదలెట్టాడు పెద్దాయన.

ఇంకా కావాలంటే.....గ్రేట్ అంధ్రా. కాం (ఇక్కడ) నొక్కండి.

అనిల్ చీమలమఱ్ఱి

Read more...

ఈ పద్య రచయిత ఎవరు?

>> Friday, September 22, 2006




తొండమునేకదంతము దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగమ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
గొండొక గ్రుజ్జు రూపమును గోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్

చంటి పిల్లలు సైతం నేర్చుకొని పాడడనికి వీలుగ ఉన్న ఈ పద్య రచయిత ఎవరు?

Read more...

సంకలనం

>> Sunday, September 17, 2006

నేటి చదువు

ఓం నమఃశివాయ పోయి
ఓహ్ - ఆహ్ స్వరాలు వచ్చాయ్,
అ, ఆ ల స్థానంలో ఎ బి లొచ్చాయ్
పెద్దబాల శిక్ష అసలే లేదు
పెద్ద బరువుల బాల 'శిక్ష' వచ్చి
చిన్న చిన్న పసికూనల్ని
అతలాకుతలం చేస్తోంది
ఇష్ఠపడి చదవడం మాట అటుంచి
కష్టపడి చదవటం ఎక్కువైంది
ఊ అంటే ఫారిన్ చందాన
నేటి చదువు - కకావికలుగా
రూపంతరం చెంది
శాపాంతరంగా మారింది

- కోలపల్లి ఈశ్వర్, నెల్లూరు



చప్ర (చలపాక ప్రకాష్)

ఉమ్మడి కుటుంబాలు
ఏమైపోయాయబ్బా!
అ'పార్ట్' మెంటు రూపం
దాల్చినట్లున్నాయి కాదూ..

- చలపాక ప్రకాష్, విజయవాడ



పీడకల

మనిషికి మనిషే భారమైన వేళ
నైతిక విలువలు దిగజారిన వేళ
విషపు మార్కెట్ సంస్కృతిలో పడి
ప్రేమానురాగాలు లాభనష్టాల
బేరీజులో ఓటమిపాలైన వేళ
రాజ్యం తన విధులను విస్మరించిన వేళ
గుండెలోని ఆర్ధ్రత కన్నీటి రూపంలో
బయటపడుతున్న వేళ
భవిష్యత్తు గురించిన ఆలోచన
నేడు కనే పీడకల

- ముషం చంద్రకళ., కమలాపూర్, కరీంనగర్ జిల్లా

Read more...

శివార్పణం

>> Saturday, September 16, 2006



అల్లన దొండ మెత్తి శివునౌదలయేటి జలంబు వుచ్చి సం
పుల్లత బాద పీఠకము పొంతన యున్న సహస్రనేత్రుని పై
జల్లి శివార్చనా కమల సంహతి బ్రోక్షణ చేయునట్లు శో
బిల్లు గజాననుండు మదభీప్సిత సిద్ది కరుండు గావుతన్||


గనేశుడు తన తండ్రి శివునకు అభిషేకం చేశాడు. అంతకు మునుపే, దేవతల రాజైన ఇంద్రుడు శివునికి అభిషేకము చేసి శివుని పాదపీఠం వద్ద వంగి ప్రణామం చేసి పూజిస్తూ ఉన్నాడు.
ఇంద్రునికి ఒళ్ళంతా కళ్ళే, అందుకే అతనికి సహస్ర నేత్రుడని పేరు., తొండము ఎత్తి శివుని అభిషేకములో నిమఘ్నుడైన గణపతి, శివని పాదాల వద్ద ఉన్న తెరుచుకొని ఉన్న ఆ వేయి కళ్ళను (ఇంద్రుని) చూసి పూలనుకొని భ్రమించి పూజలో ఉంచిన అన్ని వస్తువులను ప్రోక్షణ చేసినట్లు గానే, కళ్ళపై నీరు చల్లి 'శివార్పణం' చేసాడు.

ఈ అద్భుతమైన కావ్యం క్రీ.శ 1550-1560 కాలమునాటి శ్రీ 'పెద్దపాటి జగ్గన' కవి రచించిన 'ప్రబంధ రత్నాకరము' అను సంకలన గ్రంధం లోనిది.

Read more...

కాలగర్భం లో ... కోటిలింగాల

>> Thursday, September 14, 2006

2500 సం. క్రితం శాతవాహనుల తొలి రాజధాని, ప్రస్తుతం, గోదావరీ తీరంలొ కరీంనగర్ జిల్లా వెలగటూరు మండలం లో ఉన్న కోటిలింగాల. అది ఇప్పుడు ఓ కుగ్రామము. అది ఒకప్పుడు శతవాహన సామ్రాజ్య రాజధాని.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తలపెట్టిన నీటి ప్రాజెక్టుల పుణ్యమా అని ఆ కుగ్రామము "శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్" కింద ముంపునకు గురౌతుంది.

కరీంనగర్‌కు 65 కి.మీ. దూరంలొ ఉన్న కోటిలింగాల గ్రామంలొ పురావస్తు శాఖ 1979 లొ త్రవ్వకాలు నిర్వహిస్తే మట్టి కోట, బౌద్ధ స్తూపం, శ్రీముఖ శాతవాహనుడు ముద్రించిన నాణేలు లభించినాయి. వీటిని పరిశీలిస్తే ఇక్కడ అశోకుని హయాంనకు పూర్వమే ఇక్కడ బౌధమతం ఉన్నట్లు తెలుస్తోంది.

శాతవాహనుల తొలి రాజధాని నీటి ప్రాజెక్టుల వలన కాలగర్భం లోనూ నీటి గర్భం లోనూ కలసి పోతున్నది....

(ఈ విషయమును తెలియచెసినది శ్రీ పి.ఆర్.మాల్యాల గారు, గ్రేట్ఆంధ్రా.కాం అను వెబ్ సైట్ లో)

Read more...

గోవిందా...గోవిందా !!!

>> Monday, September 11, 2006

సోదరులారా!...

కోపం వద్దు....పుట్టపర్తి వారు అదృష్టవంతులు....

ఎలాగంటారా...

ఎఱ్ఱటి ఎండలో, లేక, ఝోరు వర్షం లొ, నీడలేక నిలబడి, మట్టి కోట్టుకు పోకుండా కాపాడారు....సంతోషించండి..

మామూలుగా ఐతే, కాకుల రేట్టలకు ఆలవాలము..మన సరస్వతీ పుత్రుల విగ్రహం....

అవునా కాదా?

భారతీయ చింతన: అంత ప్రేమ, భక్తి, గౌరవం ఉంటే ఇంట్లో పెట్టుకొని పూజించు... వాడు విగ్రహం తీసేసాడని గోలెందుకు...అయినా తెలుగు తల్లి విగ్రహం పగిలినప్పుడు రాని కోపం ఇప్పుడెందుకు?

Read more...

రాజభోగం

>> Wednesday, September 06, 2006

kosarAju

ఖాతాదారులను నట్టేట ముంచిన కృషీ బ్యాంకు అధినేత "కొసరాజు గారికి జరుగుతున్న రాజభోగాలు" చూస్తుంటే....ఇతనే మోసం చెశాడా అనిపిస్తుంది..

అర్ధాంతరంగా బ్యాంకును మూసేసి, విదేశాలకు పారిపోయి, విలాసాలు అనుభవించినదే కాకుండా ప్రస్తుతము..చుట్టూ సెక్యూరిటితో, విందులతో, ఆ పరీక్షలు, ఈ పరీక్షలు అని విహార యాత్రలు చేస్తున్నాడు.

అయినా దొంగలకి, నేరస్తులకి, రౌడీలకు ఈ రాజభోగమేమిటో?

వాడు నేను మోసం చేశాను అంటుంటే, లై డిటెక్టర్ పరీక్షలని, ఇంకో పరీక్షలని ఇంకా మన డబ్బు ఎందుకు దొబ్బెట్టాలి? ఖాతాదారులనుంచి దొబ్బింది సరిపోలేదా?

"వాడిని మధ్యకు వదలండి, నిజాలు రాబడతాము", అనే ఖాతాదారులకన్నా లై డిటెక్టర్లు గొప్పవా, నిజాన్ని వెలికి తీయడంలో?

ఇకనైనా ఈ టెస్టులు అనటం మానేసి, " చెబుతావా? ఛస్తావా!" అనడం మచిదేమో...ఆలోచించండి పోలీసు బాబాయిలు...

"కొస"మెరుపు : బ్యాంకులనుంచి ఋణాలు తీసుకొనే ఒక పెద్దమనిషి, ఆ డబ్బుతో, విదేశీయానం చేస్తూ, ఫొటోలు తీసుకోంటూ, రోడ్డు ఎక్కాడు (అదేనండి ప్రకటనలకై బోర్డులు, హోర్డింగులు ఎక్కాడు). ఇంతకీ అతను డబ్బు మొత్తం చెల్లించాడా లేదా, దేశంలో ఉన్నాడా లేదా అనేవి తెలియలేదు.

అతని పేరా....ఆ ఒక్కటీ అడక్కు..!

(ప్రపంచం మొత్తానికీ అతని పేరు తెలుసు...మీకు తెలియకపోతే చెప్పండి....అప్పుడు నేను చెబుతాను.)

Read more...